Kriti Sanon | మహేశ్ బాబు నటించిన వన్ నేనొక్కడినే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించింది ఢిల్లీ బ్యూటీ కృతిసనన్ (Kriti Sanon). ఆ తర్వాత నాగచైతన్యతో దోచెయ్ సినిమా చేసింది. ఈ మూవీ తర్వాత తన ఫోకస్ హిందీ సినిమాలపైనే పెట్టిన కృతిసనన్ చివరగా తెలుగులో ప్రభాస్తో ఆదిపురుష్ సినిమాలో నటించింది. ప్రొఫెషనల్ కమిట్మెంట్స్తో బిజీబిజీగా ఉండే కృతిసనన్.. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
తాజాగా ఈ భామ ముంబై ఎయిర్పోర్టులో ప్రత్యక్షమైంది. తెలుపు రంగు సల్వార్ సూట్ (salwar suit)లో బ్లాక్ స్టైలిష్ గాగుల్స్ పెట్టుకొని.. ఎయిర్పోర్టులోకి ఎంట్రీ ఇవ్వగా.. అక్కడే ఉన్న కెమెరాలు క్లిక్మనిపించాయి. ఈ విజువల్స్ నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. ఇటీవలే క్రూ సినిమాతో అందరికీ హాయ్ చెప్పిన కృతిసనన్ ప్రస్తుతం Do Patti సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రానికి నిర్మాతగా కూడా వ్యహరిస్తుండటం విశేషం.
ముంబై ఎయిర్పోర్టులో..
Pretty #kritisanon 🤩👌👍🤞🧿 how pretty she is looking 🤍 beauty pic.twitter.com/IGQHOCZFyl
— SK_M (@LK_A1234) May 8, 2024
హ్యాపీ మూడ్లో కృతిసనన్ ..
Back to school! 🏫
After 15years!!
Such a proud feeling to be back to my school to promote my film #Bhediya 🐺!!
Nostalgic! 🥹🥹D.P.S. R.K.Puram has given me a lot.. it truly shaped the person I am today!
And it was the best feeling to come back to say “I made it!” 💃🏻❤️ pic.twitter.com/yQQapkG8ak— Kriti Sanon (@kritisanon) November 23, 2022