న్యూఢిల్లీ : ప్రస్తుతం రోడ్లపై నడుస్తున్న కార్లలో ఎయిర్బ్యాగ్స్ తప్పనిసరిగా బిగించుకోవాలన్న గడువును కేంద్ర ప్రభుత్వం పొడగించింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ గడువును డిసెంబర్ 31 వరకు పొడగించినట్లు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆదివారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. డ్యుయెల్ ఎయిర్బ్యాగ్ సిస్టమ్ను డిసెంబర్ 31 లోగా కార్లన్నింటికి బిగించాలని ఆదేశించింది.
ప్రమాదానికి గురైన సందర్భాల్లో కారులో ఉన్నవారు చనిపోకుండా ఉండేందుకు ఎయిర్బ్యాగ్స్ బిగింపు తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం గత మార్చి నెలలో ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే తయారైన వాటితోపాటు ఉత్పత్తి చేసే అన్ని రకాల కార్లలో డ్యుయెల్ ఎయిర్బ్యాగ్స్ తప్పనిసరి అని కేంద్రం తెలిపింది. కొత్తగా మార్కెట్లోకి వచ్చే కార్లకు ఈ గడువును ఏప్రిల్ 1 గా పెట్టారు. రోడ్లపై తిరిగే అన్నిరకాల కార్లకు డ్రైవర్ సీట్ ఎయిర్బ్యాగ్స్ తప్పకుండా ఉండాలని కేంద్రం పేర్కొన్నది. అయితే, ఇండియన్ ఆటోమోబైల్ మాన్యుఫాక్చరర్స్ సొసైటీ చేసిన విజ్ఞప్తి మేరకు గడువును డిసెంబర్ 31 వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర రవాణా శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
టోక్యో ఒలింపిక్స్ ఆడటం లేదు: సెరెనా విలియమ్స్
యూరప్కు మొదటి బ్యాచ్ హీరో ఈ-బైక్స్
ఊపిరితిత్తులతో డెల్టా ప్లస్కు సంబంధం : డాక్టర్ అరోరా
మామూలు పిల్లోడిని.. రాష్ట్రపతి అవుతాననుకోలేదు: రాంనాథ్ కోవింద్
వ్యాక్సిన్ తీసుకున్న మహిళలో డెల్టా ప్లస్ వేరియంట్..!
లేహ్లో రక్షణ మంత్రి పర్యటన.. మాజీ సైనికులతో భేటీ
ప్రజా ఉద్యమంగా తెలుగు భాష పరిరక్షణ, వ్యాప్తి – వెంకయ్య నాయుడు
సహాయకురాలికి ముద్దిచ్చిన మంత్రి రాజీనామా
బరువు తగ్గాలా..? ఈ చిట్కాలు పాటించండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..