ముంబై : యూరప్ దేశాల్లో తమ ఈ బైక్స్ అమ్మకాలు పెంచుకునేందుకు హీరో సైకిల్స్ కార్యాచరణ సిద్ధం చేసుకున్నది. ఇందులో భాగంగా మొదటి బ్యాచ్ మేడిన్ ఇండియా ఈ-బైక్లను దాదాపు 200 యూనిట్లను యూరప్లోని జర్మనీకి విజయవంతంగా పంపించింది. హీరో సైకిల్స్ సంస్థ హీరో మోటార్స్ కంపెనీ (హెచ్ఎంసీ) గ్రూపులో భాగం. భవిష్యత్లో యురోపియన్ యూనియన్ (ఈయూ) కోసం మరిన్ని యూనిట్లను ప్లాన్ చేయడంతో.. ఈయూ మార్కెట్లో లీడర్గా మారాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నది.
హీరో ఇంటర్నేషనల్-యూరోపియన్ బైక్, హెచ్ఎంసీ ఈ-బైక్ 2025 నాటికి 300 మిలియన్ యూరోల ఆర్గానిక్ రెవెన్యూ సాధించడాన్ని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నది. అదే సమయంలో ఇనార్గానిక్ గ్రోత్ నుంచి 200 మిలియన్ యూరోలను జోడించనున్నారు. హీరో ఇంటర్నేషనల్ హెచ్ఎన్ఎఫ్ బ్రాండ్ క్రింద కంపెనీ ఈ-బైకులను ఎగుమతి చేసింది. ‘ఐరోపాలో అతిపెద్ద సమగ్ర ఇంటిగ్రేటెడ్ ఈ-బైక్ కంపెనీగా హెచ్ఎంపీని స్థాపించడానికి ఈ రవాణా ఒక అడుగు ముందుకు వేసేందుకు సహకరిస్తుందని కంపెనీ తెలిపింది.
2030 నాటికి ఈ-బైక్ అమ్మకాలను 15 మిలియన్ యూరోలకు పెంచుకోవాలనే లక్ష్యంతో హీరో సైకిల్స్ పనిచేస్తున్నది. లుథియానాలోని 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సైకిల్ వ్యాలీలో ఉన్నత స్థాయి నాణ్యత గల సైకిళ్లను ఉత్పత్తి చేస్తున్నట్లు లండన్ కేంద్రంగా ఉన్న హీరో ఇంటర్నేషనల్ సీఈఓ జెఫ్ వైస్ పేర్కొన్నారు. కరోనా వైరస్ ఉద్ధృతి నేపథ్యంలో గత ఏడాది కాలంగా హీరో సైకిల్స్ నుంచి ఈ-బైక్స్ ఉత్పత్తి, పంపిణీ మందకోడిగా సాగి.. ఇప్పుడిప్పుడే వేగం పుంజుకుంటున్నది.
ఊపిరితిత్తులతో డెల్టా ప్లస్కు సంబంధం : డాక్టర్ అరోరా
మామూలు పిల్లోడిని.. రాష్ట్రపతి అవుతాననుకోలేదు: రాంనాథ్ కోవింద్
వ్యాక్సిన్ తీసుకున్న మహిళలో డెల్టా ప్లస్ వేరియంట్..!
లేహ్లో రక్షణ మంత్రి పర్యటన.. మాజీ సైనికులతో భేటీ
ప్రజా ఉద్యమంగా తెలుగు భాష పరిరక్షణ, వ్యాప్తి – వెంకయ్య నాయుడు
సహాయకురాలికి ముద్దిచ్చిన మంత్రి రాజీనామా
హాంగ్కాంగ్ యాపిల్ డెయిలీ మూసివేత
బరువు తగ్గాలా..? ఈ చిట్కాలు పాటించండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..