ముంబై : (Shivasena) గవర్నర్లతో రాష్ట్ర ప్రభుత్వాలకు పొసగకపోవడం అనేది అనాదిగా వస్తున్నదే. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్రాల్లో అధికారంలో కూడా ఉండటం వల్ల ఈ సమస్య ఎక్కువగా కనిపించడం లేదు. అయితే, కేంద్రంలోని పార్టీకి చెందిన ప్రభుత్వాలు లేని రాష్ట్రాల్లో.. కేంద్రం నియమించే గవర్నర్లతో తలనొప్పులు వస్తున్నాయి. దాంతో గవర్నర్ల వ్యవస్థను ఎత్తివేయాలనే డిమాండ్ గత కొన్నేండ్లుగా ఉన్నది. తమను ఇబ్బంది పెట్టాలని చూస్తున్న మహారాష్ట్ర గవర్నర్పై ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న శివసేన పార్టీ గుర్రుగా ఉన్నది.
పశ్చిమ బెంగాల్లో మమతతో అమితుమీకి సిద్ధమై గవర్నర్ జగ్దీప్ ధంకర్.. ముఖ్యమంత్రిని అనరాని మాటలు అన్నారు. తనే ప్రభుత్వ పెద్ద అన్న రీతిలో ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి సలహా మేరకు నడుచుకోవాలన్నదే మరిచి ప్రవర్తించారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో మమత తిరిగి విజయం సాధించడంతో ధంకర్ మౌనం వహించారు. అచ్చం అలాంటి ఘటనలే మహారాష్ట్రలో చోటుచేసుకుంటున్నాయి. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు పొసగడం లేదు. ఇద్దరి మధ్య లేఖల యుద్ధం నడుస్తున్నది. రాష్ట్రంలో మహిళ రక్షణ, భద్రతపై చర్చించేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలను పిలువాలని గవర్నర్ కోశ్యారీ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. గవర్నర్ లేఖపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉద్ధవ్ ఠాక్రే.. ఈ విషయంపై చర్చించేందుకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నడపాలని కేంద్ర హోంమంత్రికి లేఖ రాయమని తిరుగు టపాలో సమాధానమిచ్చారు.
కోశ్యారీపై ఇంకా కోపంతో ఉన్న శివసేన.. గవర్నర్లను దొంగ ఏనుగులని, వారు ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతున్నారని ఆరోపించింది. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో గవర్నర్లు దొంగ ఏనుగుల్లా మారారని దుయ్యబట్టింది. ఈ దొంగ ఏనుగుల మావటిలు ఢిల్లీలో కూర్చుని తమాషా చూస్తున్నారని ఆరోపించింది. కోశ్యారీ పేరును నేరుగా ప్రస్తావించకుండా పార్టీ అధికార పత్రిక ‘సామ్నా’లో శివసేన తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను అస్థిరపరిచేందుకు కేంద్రం గవర్నర్లను ఉపయోగిస్తుందని ఆరోపించింది. 12 మంది ఎమ్మెల్సీల నియామకపు ఫైల్ను తనవద్దే అట్టేపెట్టుకోవడం పట్ల గవర్నర్ కోశ్యారీ తీవ్ర విమర్శలకు గురయ్యారు.
పంజాబ్లో తప్పిన భారీ ఉగ్రదాడి, ముగ్గురు అరెస్ట్
కోవలం, ఈడెన్ బీచ్లకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్.. ఎందుకో తెలుసా?
ఐఆర్సీటీసీ ‘లేహ్-లడఖ్’ పర్యాటక ప్యాకేజీ సిద్ధం..
ఇయర్ బడ్స్ వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త! ఎందుకంటే..
కెప్టెన్కు షాకిస్తున్న సీఎం చన్నీ
ఇప్పుడిక చంద్రుడిపైకి పర్యాటక యాత్ర
ఎన్నికల కోసం రిచర్డ్ నిక్సన్ ‘చక్కర్’ ప్రసంగం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..