న్యూయార్క్ : (Moon Tourism) స్పేస్ టూరిజం తర్వాత మూన్ టూరిజం రియాలిటీగా మారబోతున్నది. అంతరిక్ష పర్యాటకం విజయవంతం కావడంతో.. ఇప్పుడిక చంద్రుడిపైకి పర్యాటక యాత్ర చేపట్టేందుకు సిద్ధమవుతున్నది. అంతా అనుకున్నట్లుగా జరిగితే రానున్న 3,4 ఏండ్లలో చంద్రుడిపైకి టూరిస్టులు వెళ్లనున్నారు. రెండు దిగ్గజాల కంపెనీలు చంద్రుడిపై పర్యాటకులను ల్యాండింగ్ చేయడానికి ల్యాండర్ తయారీలో నిమగ్నమై ఉన్నాయి. స్పేస్ఎక్స్లో ఇప్పటికే 8 మంది కస్టమర్లు ఉన్నారు. వారు చంద్రుడికి వెళ్లడానికి పెద్ద ఎత్తున డబ్బు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు.
మూన్ టూరిజం కోసం నాసా 5 కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నది. ఎలోన్
మస్క్కు చెందిన స్పేస్ఎక్స్, జెఫ్ బెజోస్కు చెందిన బ్లూ ఆరిజిన్తో పాటు మరో మూడు కంపెనీలు ఈ గ్రూపులో ఉన్నాయి. చంద్రుడిపైకి సజావుగా ప్రయాణించడానికి ల్యాండర్లను తయారు చేయడానికి నాసా నుంచి రూ.1,078 కోట్ల ఒప్పందాన్ని అందుకున్నాయి. నాసా ఆర్టెమిస్ మిషన్ ప్రోగ్రామ్ లక్ష్యం.. చంద్రుడిపైకి మహిళతోపాటు ఒక నల్లజాతీయుడిని పంపడం. స్పేస్ఎక్స్, బ్లూ ఆరిజిన్తో ఒప్పందం చంద్రుడిపైకి వెళ్లేందుకు కొత్త మార్గాలను తెరిచేందుకు బలమైన ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఉన్నదని నాసా హ్యూమన్ ల్యాండింగ్ సిస్టమ్ ప్రోగ్రామ్ మేనేజర్ లిసా వాట్సన్ మోర్గాన్ చెప్పారు.
అంతరిక్ష పర్యాటకానికి వెళ్లేందుకు ఖర్చు దాదాపు రూ.400 కోట్లకు పైమాటగా ఉన్నది. చంద్రుడి పర్యటన అంతరిక్షం కంటే ఖరీదైనది కానున్నదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ప్రయాణాన్ని సులభతరం చేయడానికి నాసా పర్యవేక్షణలో స్పేస్ఎక్స్ స్టార్షిప్ రాకెట్ను రూపొందిస్తున్నది. తొలి దఫాలో నలుగురిని చంద్రుడిపైకి పంపేందుకు నాసా ప్రణాళికలు వేసింది. వీరిలో నుంచి ఇద్దరు చంద్రుడిపై దిగుతారు. వారం తర్వాత తిరిగి భూమిపైకి చేరుకుంటారు. ఇందుకోసం రూ.21,000 కోట్లు ఛార్జ్ చేయనున్నట్లు తెలుస్తున్నది.
ఎన్నికల కోసం రిచర్డ్ నిక్సన్ ‘చక్కర్’ ప్రసంగం
కోవిడ్ బాధిత కుటుంబాలకు రూ.50 వేల పరిహారం : కేంద్రం ప్రతిపాదన
పడిపోయిన ఆర్-వ్యాల్యూ.. మందగించిన కొవిడ్ వ్యాప్తి
శ్రీరాముడి బస ఆధారంగా కొత్త టూరిజం సర్క్యూట్
వ్యాక్సిన్లపై యువకుడి వినూత్న ప్రమోషన్.. ఎక్కడంటే?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..