జలంధర్ : (Channi Shock) ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వెంటనే పలు నిర్ణయాలు తీసుకుంటూ చరంజీత్ సింగ్ చన్నీ ఆకట్టుకుంటున్నారు. ఇదేసమయంలో కెప్టెన్కు షాకులు కూడా ఇస్తున్నారు. ఆయన నియమించిన 13 మంది ఓఎస్డీలు, సలహాదారులను ఊడబెరికారు. అంతటితో ఆగకుండా 15 రోజుల్లోగా ప్రభుత్వ భవనాన్ని ఖాళీ చేయాలని వారికి అల్టిమేటం జారీ చేశారు. అలాగే, సెక్యూరిటీని కూడా తగ్గించారు.
పంజాబ్ ముఖ్యమంత్రిగా నియమితులైన చరంజీత్ సింగ్ చన్నీ తనదైన మార్క్తో ముందుకు దూసుకెళ్తున్నారు. కెప్టెన్ అమరీందర్ సింగ్ను సీఎం కుర్చీ నుంచి తప్పించిన అనంతరం.. ఆయన గతంలో తీసుకున్న నిర్ణయాలపై చన్నీ సమీక్ష జరుపుతున్నారు. కెప్టెన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నియమించిన ఓఎస్డీలు, సలహాదారులను ఉద్యోగం నుంచి తొలగించారు. 15 రోజుల్లోగా ప్రభుత్వ వసతిగృహాలను ఖాళీ చేయాల్సిందిగా ఆదేశించారు. వీరిలో ఐదుగురు ఇప్పటికే రాజీనామా చేశారు. ప్రభుత్వం అందించిన అన్ని రకాల సదుపాయాను తిరిగివ్వాలని సూచించారు. కెప్టెన్కు ఇచ్చిన ప్రభుత్వ వాహనం, భద్రతను కూడా వెనక్కి తీసుకున్నారు.
13 మంది ఓఎస్డీలు, సలహాదారులను నియమించిన ప్రభుత్వం.. ప్రజల డబ్బును విచ్చలవిడిగా ఖర్చుచేస్తున్నదనే విమర్శలు కాంగ్రెస్ను చుట్టుముట్టాయి. దుబారాను తగ్గించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందనే వాదనను కొట్టిపారేసేందుకు సీఎం చన్నీ చర్యలు తీసుకుంటున్నట్లుగా కనిపిస్తున్నది. తమ ప్రభుత్వంపై ఉన్న ఆరోపణలను, అపవాదులను తుడిచేసే పనిలో చన్నీ నిమగ్నమైనట్లు కనిపిస్తున్నది. రానున్న ఎన్నికల నాటికి పంజాబ్లో కాంగ్రెస్ పట్ల ప్రజలు ఆకర్శితులయ్యే చేయడమే ఆయన కర్తవ్యమని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.
ఎన్నికల కోసం రిచర్డ్ నిక్సన్ ‘చక్కర్’ ప్రసంగం
పడిపోయిన ఆర్-వ్యాల్యూ.. మందగించిన కొవిడ్ వ్యాప్తి
శ్రీరాముడి బస ఆధారంగా కొత్త టూరిజం సర్క్యూట్
వ్యాక్సిన్లపై యువకుడి వినూత్న ప్రమోషన్.. ఎక్కడంటే?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..