లక్నో : (Gopal Das) అయోధ్యలోని రామజన్మభూమి ట్రస్ట్ అధ్యక్షుడు నృత్య గోపాల్దాస్ ఆరోగ్యం క్షీణించింది. దాంతో ఆయనను మెరుగైన చికిత్స అందించేందుకు లక్నోకు తరలించారు. ఆదివారం ఉదయం నుంచి ఆయన యూరిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నాడు.
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్దాస్ ఆరోగ్యం ఆదివారం మళ్లీ క్షీణించింది. అతడిని లక్నోలోని మేదాంత దవాఖానకు తరలించారు. అంతకుముందు, అతను అయోధ్యలోని జిల్లా హాస్పిటల్లో చేరాడు. 83 ఏండ్ల వయసున్న నృత్య గోపాల్దాస్ మూత్ర ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నాడు. మూత్ర విసర్జన కోసం నెఫ్రాలజీ వైద్యులు బైపాస్ స్టెంట్ వేశారు. ఆక్సిజన్ స్థాయి సాధారణం కంటే తగ్గడంతో అదనంగా ఆక్సిజన్ కూడా అందిస్తున్నారు. అయినప్పటికీ ఆయన ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో.. వైద్యుల సూచన మేరకు అతడిని లక్నోలోని మేదాంత దవాఖానకు తరలించారు.
నృత్య గోపాల్దాస్ మూత్రపిండాలు సరిగా పనిచేయడం లేదని వైద్యులు తెలిపారు. దాంతో మూత్రం సరిగా ఉత్పత్తి కావడం లేదని వారు చెప్పారు. గత ఏడాది నవంబరులో మేదాంత దవాఖానలోనే గోపాల్దాస్కు ఆపరేషన్ జరిగింది. ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టడంతో శ్వాస తీసుకోవడంలో సమస్యలను ఎదుర్కొన్నారు. గత ఏడాది సెప్టెంబర్లో కొవిడ్ బారిన పడిన గోపాల్దాస్ కొద్ది రోజులకే కోలుకున్నారు.
రైతులపైకి దూసుకెళ్లిన కేంద్ర మంత్రి కొడుకు కారు, ఇద్దరు మృతి
ఈ గాజు మహా బలమైనది.. ఫోన్ స్క్రీన్లుగా వస్తే పగిలే సమస్య ఉండదంట!
సరిహద్దులో తాలిబాన్ ఆత్మాహుతి దళాల ప్రత్యేక బెటాలియన్
ప్రపంచ ఫార్మసీగా భారత్ అవతరణ : సౌమ్య స్వామినాథన్
ఊబకాయానికి ఇది మరో కారణం.. గుర్తించిన శాస్త్రవేత్తలు
భారత్లో 20 లక్షల వాట్సాప్ ఖాతాలు మూసివేత
ఈశాన్యంలో పర్యటిస్తున్న వెంకయ్యనాయుడు
తైవాన్లోకి మళ్లీ చొరబడిన చైనా విమానాలు
రాజస్థాన్లో సాగునీటి కోసం రైతుల ఆందోళన
జీపుల కొనుగోలు కేసులో ఇందిరా గాంధీ అరెస్ట్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..