Mamata banerjee | కేంద్రంలోని బీజేపీ (BJP) ప్రభుత్వంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata banerjee) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం మళ్లీ గెలిచి కేంద్రంలో అధికారం చేపడితే.. వంట గ్యాస్ సిలిండర్ల ధర అమాంతం పెరిగిపోతుందని (Gas Cylinder Price) హెచ్చరించారు. సిలిండర్ ధర రూ.2వేల వరకు పెరిగినా ఆశ్చర్యపోనవసరం లేదని వ్యాఖ్యానించారు.
దేశంలో సార్వత్రిక ఎన్నికల హడావుడి మొదలైన విషయం తెలిసిందే. కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రంలో వరుసగా రెండు సార్లు అధికారం చేపట్టిన బీజేపీ.. ఇప్పుడు హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టాలని ఉవ్విళ్లూరుతోంది. కేంద్రంలో మరోసారి అధికారంలోకి వస్తామని ప్రధాని మోదీ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్డీఏ కూటమి 400 సీట్లకు పైగానే గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో బీజేపీ హ్యాట్రిక్పై మమతా బెనర్జీ స్పందించారు. ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. జర్గ్రామ్ జిల్లాలో నిర్వహించిన ఒక పబ్లిక్ ఈవెంట్లో దీదీ మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే.. వాళ్లు వంట గ్యాస్ సిలిండర్ ధరలను రూ. 1,500 లేదా రూ. 2,000కి పెంచవచ్చని వ్యాఖ్యానించారు. ‘రాబోయే ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే.. వాళ్లు వంట గ్యాస్ సిలిండర్ ధరలను రూ. 1,500 లేదా రూ. 2,000కి పెంచవచ్చు. అప్పుడు మనం మంటలను వెలిగించేందుకు కలపను సేకరించే పాత పద్ధతికే తిరిగి వెళ్లాల్సి ఉంటుంది’ అంటూ వ్యాఖ్యానించారు.
ఇదే సమయంలో.. ఆవాస్ యోజన (Awas Yojana) కింద చేపట్టిన హౌసింగ్ ప్రాజెక్టుల విషయంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి మమతా బెనర్జీ ఓ అల్టిమేటం జారీ చేశారు. ఏప్రిల్ నెలాఖరులోగా ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నారు. అలా చేయలేకపోతే.. మే నెలలో తమ రాష్ట్ర ప్రభుత్వమే ఆ బాధ్యత తీసుకుంటుందని హెచ్చరించారు.
Also Read..
Lok Sabha | వంద మందితో బీజేపీ తొలి లిస్ట్.. నేడు ఎక్షణమైనా రిలీజ్ కావొచ్చు
LPG cylinder | వినియోగదారులకు షాక్.. పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర