లేహ్ : లడఖ్లో కొన్ని రోజుల క్రితం ఏర్పడిన కృత్రిమ సరస్సు పగిలిపోవడంతో గ్రామాల్లోకి వరద నీరు చేరింది. (Floods in Ladakh) పంటలు తీవ్రంగా నాశనమయ్యాయి. జంస్కర్ నది వంతెన కూడా తీవ్రంగా దెబ్బతిన్నది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు. ప్రజల ఆస్తులు నష్టపోకుండా జిల్లా డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (డీడీఎంఏ) చర్యలు తీసుకుంటున్నది. ముంపునకు గురైన గ్రామాన్ని కలెక్టర్ సహా పలువురు అధికారులు సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించారు.
కేంద్రపాలిత ప్రాంతం లడఖ్లోని రాంబక్ గ్రామం సమీపంలో కొద్ది రోజుల క్రితం కృత్రిమ సరస్సు ఏర్పడింది. ఈ సరస్సు అకస్మాత్తుగా పగిలిపోయింది. దాంతో పెద్ద మొత్తంలో చెత్తాచెదారం నదిలో పడి నది మార్గం మూసుకుపోయింది. దాంతో పెద్ద ఎత్తున వరదలు సమీపంలోని పంట పొలాలను ముంచెత్తాయి. వరద కారణంగా జంస్కర్ నదిపై ఉన్న వంతెన కూడా దెబ్బతిన్నది. సరస్సు పగిలిపోవడంతో స్థానిక అధికారులు హెచ్చరిక జారీ చేశారు.
సింధు నది వరదలకు సంబంధించి డీడీఎంఏ శనివారం హెచ్చరిక జారీ చేసింది. కలెక్టర్ సంతోష్ సుఖదేవ్తోపాటు సీనియర్ అధికారులు లడఖ్లో వరదల పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. నిము ప్రాంతానికి సమీపంలో నివసిస్తున్న ప్రజలను కూడా వరదల ప్రమాదం గురించి హెచ్చరించారు. వరదల కారణంగా రాంబక్, జింగ్చెన్, యురుసే, రామ్చాంగ్ కలిపే రహదారులు.. ప్రధాన రహదారి నుంచి తెగిపోయాయి. జంస్కర్ నది సింధు నదికి ఉపనది. లడఖ్లోని నిము లోయలో రెండూ ఒకదానితో ఒకటి కలుస్తాయి.
హాల్మార్క్ ఐడీకి వ్యతిరేకంగా బంగారు దుకాణాల మూసివేత
చంద్రమండలం నుంచి ఫొటో దిగిన భూమి
ల్యాబ్లో కృత్రిమ మానవ మెదడు సృష్టి
నిత్యం ఒమేగా ఫ్యాటీ ఆసిడ్స్ తీసుకోవాల్సిందే..! ఎందుకంటే..?
సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా..? అయితే, వీటిని పరిశీలించండి..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..