Mahakumbh mela | ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళా (Mahakumbh mela) ప్రాంతంలో మరోసారి అగ్నిప్రమాదం (Fire breaks out) సంభవించింది. పార్కింగ్లో ఉన్న వాహనాల్లో మంటలు చెలరేగాయి. దీంతో కుంభమేళా ప్రాంతంలో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది.
#WATCH | Uttar Pradesh: Fire broke out in 2 vehicles in Prayagraj. Several fire tenders at the spot to douse the fire. More details awaited pic.twitter.com/GsZmqphNBr
— ANI (@ANI) January 25, 2025
కుంభమేళాకు వెళ్లే ప్రధాన రహదారిలోని సెక్టార్ 2 సమీపంలోని పార్కింగ్ ఏరియాలో శనివారం ఉదయం 6:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు తమ వాహనాలను ఇక్కడే పార్క్ చేస్తారని అగ్నిమాపక శాఖ అధికారి విశాల్ యాదవ్ తెలిపారు. ప్రస్తుతం అక్కడ విపరీతమైన వేడి కారణంగా మంటలు చెలరేగినట్లు చెప్పారు. సమాచారం అందుకున్న ఆరు అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఓ కారు పూర్తిగా దగ్ధమవగా.. మరో కారు పాక్షికంగా దెబ్బతిన్నట్లు వెల్లడించారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, అందరూ సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు.
#WATCH | Prayagraj, UP: Fire Officer Vishal Yadav says, “…Devotees are coming from far-flung areas and have parked their vehicles here. The fire broke out due to extreme heat. Fire engines have reached the spot and the fire has been controlled. The Ertiga car is completely… https://t.co/MCzvzobgIo pic.twitter.com/r4yykFzIWv
— ANI (@ANI) January 25, 2025
కాగా, ఈనెల 19వ తేదీన అంటే ఆదివారం కూడా మహా కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఎల్పీజీ సిలిండర్ పేలడంతో సెక్టార్ 19లో మంటలు చెలరేగి 18 గుడారాలు ఆహుతయ్యాయి. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. నల్లటి దట్టమైన పొగలు అలుముకోవడంతో అఖాడాల సమీపంలో భయాందోళన నెలకొంది. సాయంత్రం 4 గంటలకు మంటలు అంటుకోగా గంటలోపలే మంటలు అదుపులోకి వచ్చాయని అధికారులు తెలిపారు.
45 రోజులపాటు జరిగే మహా కుంభమేళా జనవరి 13న పౌష పూర్ణిమ నాడు ప్రారంభమైంది. ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రితో ముగుస్తుంది. ఇక కుంభమేళా ప్రారంభమైన ఈనెల 13వ తేదీ నుంచి 23వ తేదీ వరకూ 10.21 కోట్ల మంది భక్తులు ప్రయాగ్రాజ్ను సందర్శించి త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ సర్కార్ వెల్లడించింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరయ్యే భక్తుల సంఖ్య 50 కోట్లు దాటుతుందని యోగి ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో కోట్లాది మందికి తగిన రీతిలో ఏర్పాటు చేసింది యూపీ ప్రభుత్వం. సుమారు లక్షా 60 వేల టెంట్లను ఏర్పాటు చేశారు. లక్షా 50 వేల టెయిలెట్లను నిర్మించారు. దాదాపు 15వేల మంది శానిటేసన్ వర్కర్లు పనిచేయనున్నారు. 1250 కిలోమీటర్ల దూరం పైప్లైన్ వేశారు. 67 వేల ఎల్ఈడీ లైట్లు, రెండు వేల సోలార్ లైట్లు, మూడు లక్షల వృక్షాలను ఏర్పాటు చేశారు.
Also Read..
“Maha kumbh | కుంభమేళాలో ధోనీ, కోహ్లీ, రోహిత్ శర్మ.. కాషాయ దుస్తుల్లో స్టార్ క్రికెటర్లు.. ఫొటోలు వైరల్”“
“Maha Kumbh | కుంభమేళాకు పోటెత్తుతున్న భక్తులు.. 10 కోట్ల మంది పుణ్యస్నానాలు”
“Hindu Code of Conduct | హిందువులకు కొత్త ప్రవర్తనా నియమావళి.. అందులో ఏం ఉందంటే?”