న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో (Delhi) పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీలోని నంగ్లాయ్లో ఉన్న పీవీసీ వ్యర్ధాలు నిల్వ ఉంచే ప్రాంతంలో శుక్రవారం రాత్రి 11.50 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి ఆ ప్రాంతమంతా విస్తరించాయి. దీంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంధి ఘటనా స్థలానికి చేరుకున్నారు. 13 ఫైర్ ఇంజిన్ల సహకారంతో మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని డివిజనల్ ఆఫీసర్ అశోక్ జైస్వాల్ తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు.
Delhi | Fire breaks out in PVC waste near Nangloi in Kamruddin Nagar
We received fire call at 11:50pm (Aug 26)… fire contained; won't spread further. 13 fire tenders on the spot. Main aim is to not let it spread to residential areas. No casualties yet: Divisional Officer, DFS pic.twitter.com/U4FsZK2nOW
— ANI (@ANI) August 26, 2022