Australia | కాన్బెర్రా, మే 8: వలసల్ని అడ్డుకునేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం మరో కఠిన నిర్ణయం తీసుకుంది. స్టూడెంట్ వీసా ‘ప్రూఫ్ ఆఫ్ సేవింగ్స్’ను భారీగా పెంచింది. కోర్సు పూర్తిచేసేందుకు తగినంత నిధులు ఉన్నాయని చూపే, ‘ప్రూఫ్ ఆఫ్ సేవింగ్స్’లో కనీస మొత్తాన్ని 3,430 డాలర్ల నుంచి 19,576 డాలర్లకు (2,86,423 నుంచి రూ.16,34,699) పెంచింది.
గత ఏడు నెలల్లో దీన్ని పెంచటం ఇది రెండోసారి. భారతీయ విద్యార్థులకు ఇది అదనపు భారం కానున్నది. స్టూడెంట్ వీసా నిబంధనల్లో చేసిన ఈ కొత్త మార్పు, ఉన్నత చదువుల కోసం ఆ దేశం వెళ్లాలనుకునే విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపనున్నది.