హైదరాబాద్, జూలై 28 : దేశంలో ప్రముఖ విమానాల నిర్వహణ, మరమ్మతులు-ఓవర్హాల్(ఎంఆర్వో) సేవలు అందిస్తున్న జీఎమ్మార్ ఏరోటెక్నిక్..హనీవెల్ ఏరోస్పేస్తో జట్టు కట్టింది. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా దేశంలో అత్యాధునిక ఎంఆర్వో సేవల విస్తరణకు ఊతమివ్వడంతోపాటు దేశీయ విమానయాన రంగ సామర్థ్యాల అభివృద్ధిలో జీఎమ్మార్ ఏరో టెక్నిక్ కీలక పాత్రను మరింత బలోపేతం చేయనున్నది.
ఈ ఒప్పందంతో ఎయిర్బస్ ఏ320న్యూ, బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల్లో లీప్ ఇంజిన్లను అమర్చిన హనీవెల్ ఏరోస్పేస్కు చెందిన ఏడు కీలక ఎల్ఆర్యూఎస్కు జీఎమ్మార్ ఏరో టెక్నిక్ సమగ్ర మరమ్మతులు, ఓవర్హాల్, డిపో స్థాయి నిర్వహణ సేవలను అందించనున్నది. ఈ సందర్భంగా జీఎమ్మార్ ఏరో టెక్నిక్ ప్రెసిడెంట్ అశోక్ గోపీనాథ్ మాట్లాడుతూ..హనీవెల్ ఏరోస్పేస్తో మా భాగస్వామ్యం కాంపోనెంట్ ఎంఆర్వో సేవల్లో మరో కీలక మైలురాయని, మా అత్యాధునిక మౌలిక సదుపాయాలను సమన్వయం చేస్తూ..దేశంతోపాటు ప్రాంతీయ లీప్ ఇంజిన్ ఆపరేటర్లకు వేగవంతమైనసేవలను అందించడానికి వీలుపడనున్నదని పేర్కొన్నారు.