రేగొండ, జూలై 28 : విద్యుత్తు షాక్తో యువ రైతు మృతిచెందిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరికోత్తపల్లి మండలం దామరంచపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన రైతు కాడపాక సాగర్(35) మంగళవారం వ్యవసాయ పనుల్లో భాగంగా వరి నారుమడికి నీరు పెట్టేందుకు కరెంట్ మోటర్ ఆన్ చేస్తుండగా, షాక్ కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.
అటువైపు వెళ్లిన పశువుల కాపరులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.