Microsoft | హైదరాబాద్, మే 8:అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్..హైదరాబాద్లో డాటా సెంటర్ను నెలకొల్పడానికి సిద్ధమైంది. ఇందుకోసం 48 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసినట్లు తెలుస్తున్నది. ఒప్పందం విలువ రూ.267 కోట్లని పేర్కొంది. హైదరాబాద్కు 40 కిలోమీటర్ల దూరంలో రంగారెడ్డి జిల్లాలో సాయి బాలాజీ డెవలపర్ల వద్ద ఈ భూమిని కొనుగోలు చేసింది.
భారత్లో డాటా సెంటర్ వ్యాపార విస్తరణలో భాగంగా హైదరాబాద్లో అతిపెద్ద డాటా సెంటర్ను నెలకొల్పడానికి ఈ భూమిని కొనుగోలు చేసినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం సంస్థకు భారత్లో పుణె, ముంబై, చెన్నైలలో మాత్రమే డాటా సెంటర్లు ఉండగా..తాజాగా హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నది నాలుగోది కావడం విశేషం. ఇప్పటికే హైదరాబాద్లో సంస్థకు ఇండియా డెవలప్మెంట్ సెంటర్(ఐడీసీ)ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.