లక్నో : కోతుల బారి నుంచి తమ పంటలను కాపాడుకునేందుకు యూపీ రైతులు వినూత్న ఆలోచనతో ముందుకొచ్చారు. లఖింపూర్ ఖేరి సమీపంలోని జహన్ నగర్ గ్రామ రైతులు పంటలను నాశనం చేస్తున్న కోతులను నిలువరించేందుకు వారు ఎలుగుబంటి (Viral Pics) వేషంలోకి మారారు. కోతులను అడ్డుకోవడంలో దిష్టిబొమ్మలు పెద్దగా ఫలితం ఇవ్వకపోవడంతో స్వయంగా రైతులే రంగంలోకి దిగారు.
Uttar Pradesh | Farmers in Lakhimpur Kheri’s Jahan Nagar village use a bear costume to prevent monkeys from damaging their sugarcane crop
40-45 monkeys are roaming in the area and damaging the crops. We appealed to authorities but no attention was paid. So we (farmers)… pic.twitter.com/IBlsvECB2A
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 25, 2023
ఈ ప్రాంతంలో 40 నుంచి 45 కోతులు తిరుగుతూ పంటలను నాశనం చేస్తున్నాయని, ఈ విషయమై తాము అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదని రైతు గజేంద్ర సింగ్ వాపోయారు.
ఇక తామందరం కొంత డబ్బు జమ చేసి రూ. 4000 వెచ్చించి ఎలుగుబంటి డ్రెస్లు కొనుగోలు చేశామని చెప్పుకొచ్చారు. రైతులు ఎలుగుబంటి డ్రెస్లతో ఉన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా, రైతుల పంటలను కాపాడేందుకు చర్యలు తీసుకుంటామని లఖింపూర్ ఖేరి డీఎఫ్ఓ సంజయ్ బిశ్వాల్ హామీ ఇచ్చారు.
Read More :