Prabhas | ఒకేపాట.. ఒకే హీరో.. ఇద్దరు హీరోయిన్లు.. ఇది ఒకప్పుడైతే కామన్. ఇప్పుడు ఆ ట్రెండ్ లేదు. అయితే.. ప్రభాస్ కొత్త ట్రెండ్కి తెరలేపారు. ఆయన నటిస్తున్న ‘రాజా సాబ్’ సినిమాలో ఏకంగా ముగ్గురు భామలతో ఆడిపాడనున్నారు. నిధి అగర్వాల్, రిద్ది కుమార్, మాళవిక మోహనన్.. ఈ ముగ్గురూ ఒకే పాటలో ప్రభాస్తో స్టెప్పులేయనున్నారట. ‘మిర్చి’ తర్వాత ప్రభాస్ హీరోయిన్లతో స్టెప్పులేయలేదు. మారిన ఇమేజ్ కారణంగా ఆ తరహా సినిమాలకు దూరమయ్యారనే చెప్పాలి.
ఇప్పుడు దర్శకుడు మారుతీ పుణ్యమా అని మళ్లీ ‘మిర్చి’ నాటి ప్రభాస్ను తెలుగు ప్రేక్షకులు చూడబోతున్నారని విశ్వసనీయ సమాచారం. అభిమానులతో ఈలలు వేయించే డాన్స్ మూమెంట్స్తో ఈ పాట ఉండనుందని తెలుస్తున్నది. పైగా ప్రభాస్ నటిస్తున్న తొలి కామెడీ హారర్ మూవీ ‘రాజా సాబ్’. మారుతీ ‘ప్రేమకథా చిత్రం’ తరహాలో హారర్తో పాటు అద్భుతమైన కామెడీ కూడా ఇందులో ఉంటుందట. ప్రభాస్ లాంటి సూపర్స్టార్తో ఇలా కామెడీ హారర్ సినిమా తీయడం నిజంగా ప్రమోగమే అని చెప్పాలి. సంజయ్దత్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నాడు.