రాయ్పూర్: స్టీల్ ప్లాంట్లో పేలుడు సంభవించింది. బొగ్గు కొలిమి అకస్మాత్తుగా పేలింది. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు సజీవ దహనమయ్యారు. మరి కొందరు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. (steel plant explosion) ఛత్తీస్గఢ్లోని బలోడా బజార్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గురువారం ఉదయం బకులాహిలోని రియల్ ఇస్పాట్ స్టీల్ ప్లాంట్లో దుర్ఘటన జరిగింది. బొగ్గు కొలిమి ప్రాంతం చుట్టూ కొంతమంది కార్మికులు శుభ్రపరిచే పనులు చేస్తుండగా అది పేలింది. మంటలు, దట్టంగా పొగలు చాలా దూరం వరకు కనిపించాయి.
కాగా, మండుతున్న బొగ్గు, అధిక వేడిమి వల్ల సుమారు ఏడుగురు కార్మికులు సజీవ దహనమయ్యారు. పది మందికిపైగా కార్మికులకు కాలిన గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు పోలీసులు, అధికారులు ఆ స్టీల్ ప్లాంట్ వద్దకు చేరుకున్నారు. కోల్ ఫర్నేస్ పేలుడుపై దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్లాంట్లోని భద్రతా నిబంధనలను పరిశీలిస్తున్నారు.
VIDEO | Balodabazar-Bhatapara, Chhattisgarh: Six workers feared dead and over 10 injured in a blast reported at a steel factory. More details awaited.
(Source: Third Party)#Chhattisgarh pic.twitter.com/P7fqqnW6LC
— Press Trust of India (@PTI_News) January 22, 2026
Also Read:
Indore’s crorepati beggar | ఈ బిచ్చగాడు కోటీశ్వరుడు.. మూడు బిల్డింగులు, కారు, ఆటోలు, వడ్డీ వ్యాపారం