గువహటి: అస్సాంలో ఈవీఎం తరలింపు వ్యవహారం దుమారాన్ని రేపుతున్నది. గురువారం రెండో దశ పోలింగ్ అనంతరం బీజేపీ నేతకు చెందిన కారులో ఈవీఎంను తరలించడంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఘటనకు బాధ్యులైన నలుగురు అధికారులను ఈసీ సస్పెండ్ చేసింది. సంబంధిత పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ నిర్వహించనున్నట్టు పేర్కొంది. ఈవీఎంను తరలించిన కారు బీజేపీ నేత కృష్ణేందు పౌల్ భార్య మధుమిత పౌల్కు చెందినదిగా గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాలని కేంద్రహోంమంత్రి అమిత్ షా ఈసీకి విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి..
450 మంది టూరిస్టులను రక్షించిన భారత జవాన్లు
థర్మల్ పవర్ ప్లాంట్లకు కొత్త నిబంధనలు
విద్యార్థినిపై గ్యాంగ్ రేప్.. బాధితురాలు ఆత్మహత్య
60 ఏండ్లు దాటినా.. ఖండాలు మారినా.. అదే ప్రేమ!
స్టాలిన్ అల్లుడి ఇంట్లో ఐటీ సోదాలు
స్పీడ్ ఎక్కువ.. డేంజర్ తక్కువ!