Earthquake | ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో మంగళవారం భూకంపం (Earthquake) సంభవించింది. దేశ రాజధాని సహా పరిసర ప్రాంతాలైన పంజాబ్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల్లో మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 5.4గా నమోదైనట్లు అధికారులు తెలిపారు.
జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir) లోని దోడా (Doda) జిల్లా గందో భలేసా గ్రామానికి 18 కిలోమీటర్ల దూరంలో 30 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో ఢిల్లీ, పంజాబ్ సహా ఉత్తరాది ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి. రాజధానిలో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల లో నుంచి ఒక్కసారిగా బైటకి పరుగులు తీశారు. పాకిస్థాన్ లాహోర్ లోనూ భూమి కంపించింది.
Also Read..
Tamanna-Vijay Varma | విజయ్ వర్మతో డేటింగ్.. ఎట్టకేలకు పెదవి విప్పిన మిల్కీ బ్యూటీ
IndiGo | ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం.. ల్యాండింగ్ సమయంలో రన్ వేను తాకిన తోక భాగం
Kazan Khan | చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నటుడు మృతి