ఉత్తరకాశీ: ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో స్వల్ప భూకంపం వచ్చింది. సోమవారం తెల్లవారుజామున 1.50 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 3.1గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ తెలిపింది. ఉత్తరకాశీకి 24 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్ర ఉన్నదని వెల్లడించింది. భూ అంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోతులు కదలికలు సంభవించాయని చెప్పింది. కాగా, అర్ధరాత్రి వేళ భూమి కంపించడంతో ఇండ్లలో నిద్రపోతున్న జనం బయటకు పరుగులు తీశారు.
Earthquake of Magnitude:3.1, Occurred on 19-12-2022, 01:50:05 IST, Lat: 30.68 & Long: 78.68, Depth: 5 Km ,Location: 24km ESE of Uttarkashi, Uttarakhand, India for more information Download the BhooKamp App https://t.co/ZgTTyLl7KF@Indiametdept @ndmaindia @Dr_Mishra1966 @Ravi_MoES pic.twitter.com/PwvR0NqPlB
— National Center for Seismology (@NCS_Earthquake) December 18, 2022
కాగా, నేపాల్లో కూడా భూమి కంపించింది. ఆదివారం రాత్రి 10.53 గంటలకు ధాడింగ్ జిల్లాలో 4.5 తీవ్రతతో భూకంపం వచ్చిందని నేపాల్ ఎర్త్క్వేక్ మానిటరింగ్ అండ్ రిసెర్చ్ సెంటర్ తెలిపింది. కఠండూకి 50 కిలోమీట్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది.