Dharmasthala Case : కర్ణాటక (Karnataka) కు చెందిన ధర్మస్థల (Dharmasthala) కేసులో ఫిర్యాదుదారు అరెస్టుపై ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (Deputy CM) డీకే శివకుమార్ (DK Shivakumar) స్పందించారు. ఈ కేసు విచారణ ప్రక్రియపై తనకు పూర్తి విశ్వాసం ఉందని అన్నారు. తప్పు ఎవరు చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు.
కేసు విచారణపై నాకు మొదటి నుంచి నమ్మకం ఉందని, ఈ దర్యాప్తును మత పెద్దలు కూడా స్వాగతించారని డీకే చెప్పారు. తప్పు చేసిన వారిపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. తన వైఖరి ఎల్లప్పుడూ న్యాయానికి, మతానికి మద్దతుగానే ఉంటుందని, మత పరమైన విషయాల్లో రాజకీయాలు చేయడం తనకు ఇష్టంలేదని ఆయన చెప్పారు.
ఈ సున్నితమైన విషయంలో కేవలం తాను న్యాయం జరగాలని మాత్రమే కోరుకుంటున్నానని డీకే శివకుమార్ అన్నారు. దర్యాప్తు సంస్థలు నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిజానిజాలు వెలికి తీస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.