న్యూఢిల్లీ : (Delhi air) ఈ ఏడాది మొదటిసారిగా ఢిల్లీ గాలి నాణ్యత ప్రమాదకర క్యాటగిరీకి మారింది. శీతాకాలానికి ముందే ఢిల్లీ ఆనంద్ విహార్ ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) అమాంతం 322 కు పెరుగడం విశేషం. గాలిలో కాలుష్య కారకాలు పీఎం 2.5, పీఎం 10 ప్రముఖంగా ఉన్నాయి. రుతుపవనాలు వెళ్లి పోయినందున ఢిల్లీ-ఎన్సీఆర్లో గాలి నాణ్యత మెల్లమెల్లగా క్షీణదశకు చేరుకుంటున్నది.
వాయు నాణ్యత సూచిక (ఏక్యూఐ) 171 కి పెరగడంతో దేశ రాజధానిలో కాలుష్యం పెరుగడం మొదలైంది. శనివారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ విషయాన్ని తెలిపారు. సెప్టెంబర్ 18 నుంచి ఢిల్లీ రోజువారీ గాలి నాణ్యతను ఆయన ట్వీట్ చేస్తున్నారు. తీవ్రమైన వేడిమి కారణంగా అక్టోబర్ మధ్య నుంచి ఇది క్షీణిస్తుందని కూడా కేజ్రీవాల్ హెచ్చరించారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్సీఆర్ ప్రాంతాల్లో థర్మల్ పవర్ ప్లాంట్లను రీట్రాఫిట్ చేయాలని, ఈ ప్రాంతంలోని పరిశ్రమల్లో సీఎన్జీతో నడిచే వాహనాలు, శుభ్రమైన ఇంధనాన్ని ఉపయోగించాలని పొరుగు రాష్ట్రాలను కేజ్రీ కోరారు. ఢిల్లీ పొరుగు రాష్ట్రాలు తమ తమ రాష్ట్రాల్లో వ్యవసాయ వ్యర్థాలను కాల్చకుండా చూడాలని, లేనిపక్షంలో శీతాకాలంలో వాయు కాలుష్యం పెరిగేందుకు దారితీస్తుందని పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గాలిని శుభ్రపరచడానికి కలిసి పనిచేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించిన టయోటా మిరై
జమ్ముకశ్మీర్లో 16 చోట్ల ఎన్ఐఏ దాడులు
2036 లో ఇండియాలో ఒలింపిక్స్..!
ఆసియాలో తొలిసారి ఒలింపిక్స్ నిర్వహణ ఇక్కడే..!
తెలంగాణ చీఫ్ జస్టిస్గా సతీష్ చంద్ర శర్మ.. రాష్ట్రపతి ఆమోదం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..