(Olympics in India) అంతా సవ్యంగా జరిగితే 2036 లో భారత్లో ఒలింపిక్స్ జరుగుతాయి. 2036 లో ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇచ్చేందుకు భాత్ చర్చలు జరుపుతున్నది. ఒలిపింక్స్ ప్రారంభ వేడుకలను అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిపితే బాగుంటుందని కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది.
ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) 2036 ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమైంది. 2036 ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇవ్వడానికి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) తో ఐఓఏ చర్చలు జరుపుతున్నది. ఈ విషయాన్ని ఐఓఏ అధ్యక్షుడు నరేంద్ర బాత్రా వెల్లడించారు. అంతా అనుకున్నట్లు జరిగితే, ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలను అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో వీక్షించవచ్చునని ఆయన తెలిపారు. నరేంద్ర బాత్రా ప్రకటన దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్నది. గత కొంతకాలంగా ఒలింపిక్స్ నిర్వహణపై భారత ప్రభుత్వంతోపాటు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఆసక్తి చూపుతున్నాయి. 2024 ఒలింపిక్స్కే భారత్ బిడ్ దాఖలు చేస్తున్నదని అప్పట్లోనే వార్తలు వచ్చాయి.
2032 ఒలింపిక్స్కు బిడ్ దాఖలు చేసే ప్రక్రియ మొదలైందని నరేంద్ర బాత్రా చెప్పారు. 2025 లోగా 2032 ఒలింపిక్స్ వేదికపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నదని, ప్రస్తుతానికి ఓ బృందం కొన్ని నగరాల్లో పర్యటిస్తున్నదని, అక్కడి అధికారులతో మాట్లాడుతూ, అవసరమైన నివేదిక తయారు చేస్తున్నదని బాత్రా పేర్కొన్నారు. ఒలింపిక్స్ను భారతదేశంలోని మూడు లేదా నాలుగు నగరాల్లో నిర్వహించవచ్చని, 2036 కోసం భారతదేశం బిడ్ గురించి ఐఓసీని అడిగినట్లు బాత్ర చెప్పారు. భారతదేశానికి ఈ అవకాశం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన తెలిపారు.
అయితే, 2036 మెగా ఒలింపిక్స్ నిర్వహణకు ముందు 2026 యూత్ ఒలింపిక్స్ ఆతిథ్య హక్కుల కోసం భారత్ పోటీపడనున్నది. 2026 యూత్ ఒలింపిక్స్ నిర్వహణ రేసులో రష్యా, థాయిలాండ్, కొలంబియాలతో భారత్ పోటీపడుతున్నది. యూత్ ఒలింపిక్స్ విజయవంతంగా నిర్వహించి.. 2036 ఒలింపిక్స్కు సర్వ సన్నద్ధం కావాలనేది భారత ఒలింపిక్ సంఘం ఆలోచన.
ఆసియాలో తొలిసారి ఒలింపిక్స్ నిర్వహణ ఇక్కడే..!
తెలంగాణ చీఫ్ జస్టిస్గా సతీష్ చంద్ర శర్మ.. రాష్ట్రపతి ఆమోదం
చైనా తయారీ టెస్లా కార్లు ఇక్కడ అమ్మొద్దు : నితిన్ గడ్కరీ
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..