న్యూఢిల్లీ : (Chief Justice) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు నియమితులయ్యారు. తెలంగాణ సీజేగా సతీష్ చంద్ర శర్మ, ఆంధ్రప్రదేశ్కు ప్రశాంత్ కుమార్ మిశ్రాలను కేటాయించారు. మొత్తం 13 హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తుల నియామకం, బదిలీలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. ప్రస్తుతం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తులతో పనిచేస్తున్న పలు హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులను కేటాయించగా, ఇతర హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు నియమితులయ్యారు. తెలంగాణ సీజేగా నియమితులైన సతీష్ చంద్ర ప్రస్తుతం కర్ణాటక యాక్టింగ్ చీఫ్ జస్టిస్గా ఉన్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్కు నియమించిన ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రస్తుతం ఛత్తీస్గఢ్ యాక్టింగ్ చీఫ్ జస్టిస్గా ఉన్నారు.
భారత రాజ్యాంగం ప్రకారం తనకు సంక్రమించిన అధికారంతో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్.. భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణను సంప్రదించి 8 హైకోర్టులకు కొత్తగా ప్రధాన న్యాయమూర్తులను నియమించగా.. మరో 5 హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులను ఇతర కోర్టుల నుంచి బదిలీ చేశారు. ఈ విషయాన్ని కేంద్ర న్యాయ శాఖ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
చైనా తయారీ టెస్లా కార్లు ఇక్కడ అమ్మొద్దు : నితిన్ గడ్కరీ
కోహ్లీ, రోహిత్ కన్నా ఈ ఆటగాడికి సామర్ధ్యం ఎక్కువ : గంభీర్ వ్యాఖ్య
పునరుజ్జీవం దిశగా ఈశాన్య భారతం: వెంకయ్యనాయుడు
ప్రీపోల్ సర్వేలను నిషేధించాలి : మాయావతి
మాకు ‘మియా’ ఓట్లు వద్దే వద్దు : హిమంత బిశ్వ శర్మ
ఔను! నేను ‘చరస్’ తీసుకున్నా.. పంచనామాలో ఆర్యన్ ఖాన్ నేరాంగీకారం
బొలీవియా అడవుల్లో చే గువేరా దారుణహత్య
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..