దుబాయ్ : (Gambhir) టీ 20 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందుగా మాజీ క్రికెటర్, ఎంపీ గౌతమ్ గంభీర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల కన్నా సామర్ధ్యం ఎక్కువ ఉన్న ఆటగాడు టీమిండియా జట్టులో ఉన్నాడని ఆయన చెప్పారు. ఆయన మరెవ్వరో కాదు కేఎల్ రాహుల్ అని కుండబద్దలు కొట్టాడు. కోహ్లీ, రోహిత్ శర్మలను భారత జట్టులో అత్యుత్తమ బ్యాటర్లుగా పరిగణించడం కొంత మందిని ఆశ్చర్యపరుస్తుందన్నారు. అందరికంటే కేఎల్ రాహుల్ పెద్ద షాట్లను ఆడటంలో ధిట్ట అని కొనియాడారు.
పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న కేఎల్ రాహుల్.. గురువారం జరిగిన చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 42 బంతుల్లో 98 నాటౌట్గా నిలిచాడు. అనంతరం రాహుల్ను ఆకాశానికెత్తుతూ గంభీర్ మాట్లాడాడు. ఈ 29 ఏండ్ల వయసున్న కుర్రాడు కోహ్లీ, శర్మ కంటే ఎక్కువ సామర్ధ్యం కలిగి ఉన్నాడని చెప్పారు. ఈ సీజన్లో రాహుల్ ఇదే మాదిరిగా ఆడి ఉంటే ప్లే ఆఫ్కు చేరేదన్నారు. ‘ఇలాగే ఆడుకో. భారతదేశం మాత్రమే కాదు ప్రపంచం గర్వించేలా గౌరవించేలా సామర్ధ్యాన్ని చాటు’ అని కేఎల్ రాహుల్కు గంభీర్ సూచించాడు.
ప్రస్తుత సీజన్ ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ 14 గేమ్లు ఆడి కేవలం 12 పాయింట్లతో ముగించింది. మళ్లీ ప్లే ఆఫ్ స్థానాన్ని కోల్పోయింది. గత కొన్ని సీజన్లలో మాదిరిగా కేఎల్ రాహుల్ మరోసారి తన ఫ్రాంచైజీ కోసం బ్యాట్తో మెరిశాడు. 13 మ్యాచులు ఆడిన రాహుల్ మొత్తం 626 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నాడు. అయితే, డుప్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్, శిఖర్ ధావన్ ప్లే ఆఫ్ చేరుకున్న జట్లతో ఉండటంతో రాహుల్కు ఆరెంజ్ క్యాప్ దక్కడం అనుమానంగానే ఉన్నది.
పునరుజ్జీవం దిశగా ఈశాన్య భారతం: వెంకయ్యనాయుడు
ప్రీపోల్ సర్వేలను నిషేధించాలి : మాయావతి
మాకు ‘మియా’ ఓట్లు వద్దే వద్దు : హిమంత బిశ్వ శర్మ
ఔను! నేను ‘చరస్’ తీసుకున్నా.. పంచనామాలో ఆర్యన్ ఖాన్ నేరాంగీకారం
బొలీవియా అడవుల్లో చే గువేరా దారుణహత్య
జాన్వీ కపూర్ మణికట్టుపై టాటూ.. ఎవరీ లబ్బూ?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..