న్యూఢిల్లీ : (Himanta Biswa Sarma) బెంగాలీ మూలం నుంచి అసోంకు వచ్చిన ముస్లింల ఓట్లు బీజేపీకి అవసరం లేదని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అన్నారు. వీరిని స్థానికంగా ‘మియా’ ముస్లింలు అని పిలుస్తారు. ‘మాకు మియా ఓట్లు వద్దే వద్దు. మేం సామరస్యంగా జీవిస్తున్నాం. ఓట్ల కోసం నేను వారి వద్దకు వెళ్లను. అలాగే వారు కూడా నా వద్దకు రారు’ అని ఆయన చెప్పారు. ఇండియా టుడే కాంక్లేవ్-2021 లో హిమంత బిశ్వ శర్మ మాట్లాడారు.
అసోం గుర్తింపు, సంస్కృతి, భూమిని కోల్పోవడానికి రాష్ట్రంలోని చాలా మంది ప్రజలు వలస వచ్చిన ముస్లింలే కారణమని నమ్ముతారని హిమంత చెప్పారు. మా రాష్ట్రంలో సమాజ ఆధారిత రాజకీయాలు లేవన్నారు. ముస్లిం వలసదారులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నందున ఆక్రమణలు తీవ్రంగా జరుగుతున్నాయని ఆరోపించారు. మాదకద్రవ్యాల రికవరీ రోజుకు దాదాపు రూ.2 కోట్ల వరకు ఉంటున్నదని తెలిపారు. ముఖ్యమంత్రి అయిన తర్వాతి 100 రోజుల్లో తమ ప్రభుత్వం 2,000 మంది స్మగ్లర్లను, 500 మంది ల్యాండ్ బ్రోకర్లను అరెస్టు చేసిందని వెల్లడించారు. భూమి రికార్డులను డిజిటలైజ్ చేసి, గిరిజన ప్రజలతో శాంతి ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. అస్సాం అభివృద్ధి పథంలో ఉన్నదని, రానున్న ఐదేండ్ల కాలంలో దేశంలోని అగ్ర రాష్ట్రాలలో అసోం ఒకటిగా నిలువడం ఖాయమని హిమంత బిశ్వ శర్మ అన్నారు.
చీపురు చేత పట్టినంత మాత్రానా సామాన్య ప్రజల్ని ఆకట్టుకోలేం అని సీతాపూర్లోని గెస్ట్హౌజ్లో చీపురుపట్టి శుభ్రం చేసిన ప్రియాంక వాద్రా వీడియోపై హిమంత వ్యాఖ్యానించారు. ‘ నా తల్లి ఇంట్లో చీపురుతో శుభ్రం చేస్తుంది. ఇదేమీ పెద్ద విషయం కాదు. అందరు మహిళల మాదిరిగానే ప్రియాంక వాద్రా కూడా తన గదిని శుభ్రం చేసుకున్నారు. ఇలాంటి వీడియోలు ప్రదర్శించి మహిళల్ని డీఫేం చేయడం తగదు’ అని హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు.
ఔను! నేను ‘చరస్’ తీసుకున్నా.. పంచనామాలో ఆర్యన్ ఖాన్ నేరాంగీకారం
బొలీవియా అడవుల్లో చే గువేరా దారుణహత్య
జాన్వీ కపూర్ మణికట్టుపై టాటూ.. ఎవరీ లబ్బూ?
రెండు చక్రాలపై మూడు చక్రాల బండి.. చెన్నై వాసి గిన్నీస్ రికార్డ్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..