కాలిఫోర్నియా : (Toyota Mirai) హైడ్రోజన్ పవర్డ్ టయోటా మిరై గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది. 2021 టయోటా మిరై హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వాహనం రెండోసారి ఇంధనం నింపకుండానే అత్యధిక దూరం ప్రయాణించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో తన పేరును నమోదు చేసుకున్నది. హైడ్రోజన్ ఇంధనంతో నడిచే టయోటా మిరై దక్షిణ కాలిఫోర్నియాలో ఒక రౌండ్ ట్రిప్ పర్యటనకు గాను ఐదు నిమిషాలు నింపడంతో 1360 కి.మీ ట్రిప్ పూర్తి చేసింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ రికార్డు పర్యటన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారులు నిశితంగా పరిశీలించిన అనంతరం ధ్రువీకరించారు.
టయోటా సంస్థ నుంచి వచ్చిన హైడ్రోజన్ పవర్డ్ మిరై.. దక్షిణ కాలిఫోర్నియాలో ఒక రౌండ్ ట్రిప్ నిర్వహించింది. 5.65 కిలోల ఇంధనం నింపిన తర్వాత రికార్డు స్థాయిలో 1360 కి.మీ ప్రయాణించింది. దాంతో రెండోసారి ఇంధనం నింపకుండా సుదీర్ఘ దూరం ప్రయాణించడం వరల్డ్ రికార్డ్ అని గిన్నిస్ బుక్ నిర్వాహకులు తెలిపారు. ట్రిప్ ప్రారంభంలో, ముగింపులో మిరై ట్యాంక్ను గిన్నిస్ అధికారులు సీలు వేశారు. 2021 టయోటా మిరై ప్రొఫెషనల్ హైపర్మిలర్ వేన్ గెర్డెస్, బాబ్ వింగర్ ఈ ట్రిప్ను నడిపారు. తొలిరోజు 761 కి.మీ, రెండో రోజు 599 కి.మీ నడిపారు.
వాస్తవానికి, ఎఫ్సీఈవీ ఇంధనం నింపకుండా మొత్తం 12 హైడ్రోజన్ స్టేషన్లను దాటింది. రెండు రోజుల పరీక్షలో ఇది సున్నా కిలోల కార్బన్ డై ఆక్సైడ్ను విడుదల చేసినట్లు గుర్తించారు. అదే మరే ఇతర కార్ ఇంతే దూరాన్ని కవర్ చేయడానికి దాదాపు 300 కిలోల కార్బన్ డై ఆక్సైడ్ను విడుదల చేస్తుంది. జీరో-ఎమిషన్ వాహనాల శ్రేణిలో ఒకటైన ఈ అద్భుతమైన టెక్నాలజీకి నాయకులైనందుకు గర్వపడుతున్నాం అని టయోటా మోటార్ నార్త్ అమెరికా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ బాబ్ కార్టర్ అభిప్రాయపడ్డారు.
జమ్ముకశ్మీర్లో 16 చోట్ల ఎన్ఐఏ దాడులు
2036 లో ఇండియాలో ఒలింపిక్స్..!
ఆసియాలో తొలిసారి ఒలింపిక్స్ నిర్వహణ ఇక్కడే..!
తెలంగాణ చీఫ్ జస్టిస్గా సతీష్ చంద్ర శర్మ.. రాష్ట్రపతి ఆమోదం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..