న్యూఢిల్లీ: ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్కు (Arvind Kejriwal) సంబంధించిన కోర్టు విచారణ వీడియోలను సోషల్ మీడియా నుంచి తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. అనుమతి లేకుండా కోర్టు విచారణలను రికార్డ్ చేయడం నిషేధమని పేర్కొంది. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ కోర్టు వాదనలకు సంబంధించిన అనధికారిక రికార్డింగ్లను సోషల్ మీడియా నుండి తొలగించేందుకు చర్యలు చేపట్టాలని ఢిల్లీ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీపై సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ విచారణ నుంచి జస్టిస్ స్వర్ణ కాంత శర్మను తప్పించాలని కోరుతూ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఏప్రిల్ 13న ఆయన స్వయంగా కోర్టుకు హాజరై తన వాదనలు వినిపించారు.
కాగా, జస్టిస్ స్వర్ణ కాంత శర్మ, అరవింద్ కేజ్రీవాల్ మధ్య జరిగిన కోర్టు విచారణ వీడియో, ఆడియో క్లిప్స్ను ఆప్ నేతలతో పాటు కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అవి వైరల్ అయ్యాయి.
మరోవైపు ఒక వ్యక్తి దీనిపై హైకోర్టులో ఫిర్యాదు చేశారు. వీటిని ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేయడాన్ని తప్పుపట్టారు. ప్రజల అభిప్రాయాన్ని ప్రభావితం చేయడం, న్యాయవ్యవస్థ ప్రతిష్టకు హాని కలిగించడం దీని లక్ష్యమని ఫిర్యాదుదారు ఆరోపించారు. అనుమతి లేకుండా కోర్టు విచారణలను రికార్డ్ చేయడం నిషేధమని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ఈ కోర్టు విచారణ వీడియోలను సోషల్ మీడియా నుంచి తొలగించాలని ఫిర్యాదుదారు కోరారు. అలాగే ఆ క్లిప్లను షేర్ చేసిన పార్టీ నాయకులు, ఇతరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ హైకోర్టు ఈ ఫిర్యాదుపై స్పందించింది. కోర్టు విచారణ వీడియోలను సోషల్ మీడియా నుంచి తొలగించాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. అలాగే అనధికారికంగా రికార్డ్ చేసిన, షేర్ చేసిన వ్యక్తులపై చర్యలు చేపట్టాలని పేర్కొంది.
Also read:
Cop Kills Beggar | తాను మరణించినట్లుగా నమ్మించేందుకు.. బిచ్చగాడిని హత్య చేసిన డిస్మిస్ అయిన పోలీస్
Watch: ఒక్క రోజు వయసున్న ఖడ్గమృగం పిల్ల.. అరుదైన వీడియో వైరల్