న్యూఢిల్లీ : (Ramdev Baba) యోగా గురు రామ్దేవ్ బాబాకు ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది. కరోనా మహమ్మారి సమయంలో అల్లోపతికి వ్యతిరేకంగా రామ్దేవ్ బాబా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారని ఆరోపణలు ఉన్నాయి. రామ్దేవ్పై పలు వైద్యుల సంఘాలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. బుధవారం ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ సీ హరిశంకర్, రామ్దేవ్కు నాలుగు వారాల గడువు ఇచ్చారు. పిటిషన్లోని ఆరోపణల మెరిట్లపై తానెలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం లేదని పిటిషన్ విచారణ సందర్భంగా న్యాయమూర్తి స్పష్టం చేశారు.
రిషికేశ్, పాట్న, భువనేశ్వర్లోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, చండీగఢ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, పంజాబ్లోని రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్, లాలా లజపత్ రాయ్ మెమోరియల్ మెడికల్ కాలేజ్ మీరట్ తదితర సంఘాలతోపాటు తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ రామ్దేవ్ బాబాపై పిటిషన్ దాఖలు చేశాయి.
బ్రిటన్లో కొత్త ఫుడ్ ట్రెండ్ 5 : 2 .. వెజిటేరియన్ వైపు మొగ్గు
పాకిస్తాన్కు సౌదీ అరేబియా చేయూత.. 300 కోట్ల ఆర్థిక సాయం ప్రకటన
ఆఫ్ఘనిస్తాన్లోనే ఇంకా 450 మంది అమెరికన్లు.. పెంటగాన్ వెల్లడి
పంజాబ్ రాజకీయాల్లో మళ్లీ చురుగ్గా కెప్టెన్
శీతాకాలంలో వేధించే అలర్జీలు.. ఇలా చెక్ పొట్టొచ్చు!
ఈ పండు రోజూ తింటే హార్ట్ అటాక్ రాదంట..! ఆక్స్ఫర్డ్ పరిశోధకుల వెల్లడి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..