Arvind Kejriwal | పశ్చిమబెంగాల్ (West Bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో (Mamata Banerjee) ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి (Delhi CM) అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) భేటీ అయ్యారు. కోల్కతాలో మంగళవారం మధ్యాహ్నం దీదీని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఢిల్లీలో (Delhi) అధికారుల పోస్టింగ్లు, బదిలీల విషయంలో లెఫ్ట్నెంట్ గవర్నర్ (LG)కు సర్వాధికారాలు కట్టబెడుతూ కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్కు సంబంధించిన బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందకుండా సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఆర్డినెన్స్కు (Ordinance) వ్యతిరేకంగా విపక్షాల మద్దతు కూడగట్టేందుకు దేశవ్యాప్తంగా తిరుగనున్నారు. ఇందులో భాగంగానే నేడు దీదీని కలిసిన కేజ్రీవాల్.. ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా ఓటు వేయాలని కోరారు.
కేజ్రీవాల్తోపాటు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, పలువురు పార్టీ నేతలు భేటీలో పాల్గొన్నారు. ఈ భేటీ అనంతరం కేజ్రీవాల్ బృందం సాయంత్రానికి ముంబై చోరుకోనున్నారు. బుధవారం ఎన్సీపీ చీఫ్ శరద్పవార్, శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రేను కలిసి మద్దతు కోరనున్నట్లు తెలుస్తోంది.
కాగా, ఇదే విషయంమై కాంగ్రెస్ పార్టీ ఆప్కు మద్దతు ప్రకటించింది. పార్లమెంట్లో ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా ఓటేస్తామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. ఇప్పటికే బీహార్ సీఎం, జేడీయూ నేత నితీశ్కుమార్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కేజ్రీవాల్తో సమావేశమై తమ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.
AAP national convenor and Delhi CM Arvind Kejriwal, Punjab CM Bhagwant Mann and other party leaders meet West Bengal CM Mamata Banerjee in Kolkata. pic.twitter.com/vhWWB7gXqO
— ANI (@ANI) May 23, 2023
Also Read..
Sudha Murthy | 30 ఏళ్లుగా ఒక్క వెకేషన్కు కూడా వెళ్లలేదు : సుధామూర్తి
Bengaluru Rains | వరదపాలైన రూ.2కోట్ల విలువైన బంగారు ఆభరణాలు.. బెంగళూరును ముంచెత్తిన భారీ వర్షాలు!
Meta | ఫేస్బుక్ మాతృసంస్థ మెటాకు షాక్.. భారీ జరిమానా విధించిన ఈయూ