Arvind Kejriwal | సమాచార హక్కు చట్టం (Right to Information) కింద ప్రధాని నరేంద్ర మోదీ (Pm Modi) విద్యార్హతలను కోరినందుకు గుజరాత్ హైకోర్టు రూ. 25,000 జరిమానా విధించడంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal ) మరోసారి స్పందించారు. గుజరాత్ హైకోర్టు తీర్పు ప్రధానమంత్రి విద్యాభ్యాసంపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోందన్నారు.
‘మనం ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నాం. సమాచారం కోసం అడిగే స్వేచ్ఛ మనకు ఉంది. నిరక్షరాస్యులుగా ఉండటం నేరం కాదు. ప్రధానమంత్రి విద్యావంతులుగా ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే అతను ఒకే రోజులో చాలా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే గుజరాత్ కోర్టు ఉత్తర్వులు ప్రధాని మోదీ డిగ్రీపై అనుమానాన్ని పెంచాయి. డిగ్రీ చదివి ఉంటే సర్టిఫికెట్ ఎందుకు చూపించడం లేదు..? కోర్టు తీర్పు ప్రజలకు కొత్త సందేహాలకు తావిచ్చేలా ఉంది. మోదీ డిగ్రీ సర్టిఫికేట్ నకిలీవేమోనని అనుమానం కలుగుతోంది’ అని కేజ్రీవాల్ అన్నారు.
మోదీ డిగ్రీల వివరాలు వెల్లడించాలని ఏడేండ్ల క్రితం గుజరాత్ వర్సిటీకి కేంద్ర సమాచార కమిషన్ ఇచ్చిన ఆదేశాలను సైతం హైకోర్టు కొట్టివేసింది. ప్రధాని విద్యార్హతల సమాచారాన్ని కోరుతూ 2016 ఏప్రిల్లో అప్పటి కేంద్ర సమాచార కమిషనర్ ఎం శ్రీధర్ ఆచార్యులకు కేజ్రీవాల్ లేఖ రాశారు. స్పందించిన ఆయన.. మోదీ డిగ్రీలకు సంబంధించిన రికార్డులను కేజ్రీవాల్కు ఇవ్వాలని గుజరాత్, ఢిల్లీ యూనివర్సిటీలను ఆదేశించారు. ఈ ఆదేశాలను గుజరాత్ వర్సిటీ హైకోర్టులో సవాల్ చేయగా అప్పుడే కోర్టు స్టే ఇచ్చింది. గుజరాత్ యూనివర్సిటీ అప్పీల్పై శుక్రవారం విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిరేన్ వైష్ణవ్.. సీఐసీ గతంలో ఇచ్చిన ఆదేశాలను కొట్టేయడంతోపాటు కేజ్రీవాల్కు జరిమానా విధించారు.
Delhi | It's important that the PM has to be educated because he has to take a lot of decisions in a single day. HC order has increased doubt on PM Modi's degree. If he has a degree and it's real, then why isn't being shown?: CM Arvind Kejriwal pic.twitter.com/X3garLawAw
— ANI (@ANI) April 1, 2023
Also Read..
PM Modi | ప్రధాని మోదీ ఏం చదివారని అడిగినందుకు.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు 25 వేల జరిమానా
India Corona | 24 గంటల్లో 2,994 కొత్త కేసులు.. ఐదుగురు మృతి
Nita Ambani | అట్టహాసంగా ప్రారంభమైన నీతా అంబానీ డ్రీమ్ ప్రాజెక్ట్.. తరలివచ్చిన తారాలోకం