దళితబిడ్డల ఆనందోత్సాహాలు
దళిత బంధుతో మా కుటుంబాలకు ఆత్మగౌరవం
మా పిల్లల భవిష్యత్తుకు భరోసా
ఆర్థికంగా ఎదుగుతాం
ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం
ఊరూరా ఆనందోత్సాహాలు
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు
ఈ మాటలే స్ఫూర్తిగా ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత జాతి దశాదిశ మార్చే లక్ష్యంతో ముందుకెళ్తు న్నారు. 74 ఏండ్ల స్వాతంత్య్ర భారత దేశ చరిత్రలో దగా పడిన బతుకులకు భరోసానిచ్చే ఉద్దేశంతో సోమవారం విప్లవాత్మక దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారు. నాడు రైతుబంధుకు వేదికైన శాలపల్లి-ఇందిరానగర్ గడ్డపై ఈ పథకాన్ని ప్రారంభించనుండగా, దళితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
బ్యాంకుల లింకేజీలు, ష్యూరిటీలు లేకుండా నేరుగా దళిత ఆడబిడ్డల ఖాతాల్లోకి 10 లక్షల సహాయం అందనుండగా, సంబురపడుతున్నారు. కండీషన్లు లేకుండా నచ్చిన, మెచ్చిన స్వేచ్ఛతో వ్యాపారం చేసుకోవడానికి అవకాశం కల్పించిన తీరుపై సంతోషపడుతున్నారు. సీఎం కేసీఆర్ నిర్ణ యాలతో తమ జీవితాల్లో వెలుగులు నిండుతాయి.ఇక తాము ఆత్మగౌరవంతో బతికే రోజులు రాబోతున్నాయని సగర్వంగా చెబుతున్నారు. – కరీంనగర్, (నమస్తే తెలంగాణ ప్రతినిధి)