(Twitter Bird Fry) రాహుల్గాంధీ ట్విట్టర్ ఖాతాను నిలిపివేయడంపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెప్పినట్లు ట్విట్టర్ సంస్థ పనిచేస్తున్నదని ఆరోపణలు రాగానే.. రాహుల్ గాంధీ ఖాతాను పునరుద్ధరించారు. అయితే, ఆంధ్రప్రదేశ్లోని కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం ట్విట్టర్కు వినూత్న రీతిలో నిరసన తెలిపారు.
న్యూఢిల్లీలో దళిత బాలికపై సామూహిత లైంగికదాడిని రాహుల్గాంధీ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. దాంతో ట్విట్టర్ సంస్థ రాహుల్గాంధీ ఖాతాను నిలిపివేసింది. రాహుల్ గాంధీ పోస్ట్ను అనుకరించిన ఇతర కాంగ్రెస్ సభ్యుల ఖాతాలను కూడా ట్విట్టర్ సంస్థ నిలిపివేసింది. ట్విట్టర్ తీరుపై కాంగ్రెస్ పార్టీ, నేతలు నిరసన తెలపడంతో వారు రాహుల్ ఖాతాను పునరుద్ధరించారు. అంతకుముందు దీనిపై కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు వినూత్నంగా నిరసన తెలిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
‘రాహుల్గాంధీ ఖాతాను నిలిపివేసి ట్విట్టర్ బర్డ్ చాలా తప్పు చేసిందని, అందుకని దానికి శిక్ష విధించేందుకు దాన్ని ఫ్రై చేస్తున్నాం. వీటిని గుర్గావ్, ఢిల్లీలోని ట్విట్టర్ సంస్థ హెడ్క్వార్టర్స్కు పంపుతాం. మా ఈ వెరైటీ డిష్ను మీరెంతగానో ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాం’ అని చెప్తూ రెండు ట్విట్టర్ బర్డ్లను వేడి నూనెలో వేయిస్తున్న వీడియో బయటకొచ్చింది. అన్నట్లుగా ఫ్రై చేసిన ట్విట్టర్ బర్డ్లను ట్విట్టర్ సంస్థ కార్యాలయానికి పంపించినట్లు కాంగ్రెస్ నాయకులు చెప్పారు.
మహారాజా రంజిత్ సింగ్కు తీరని అవమానం..!
వారు అధికారంలోకొచ్చారు.. మహిళా మోడల్స్పై సున్నమేశారు..!
ఉత్తరాఖండ్ సీఎం అభ్యర్థిని ప్రకటించిన ఆప్
మలేషియా ప్రధానిగా యాసిన్ రాజీనామా
లాహోర్ను పాకిస్తాన్కిచ్చిన రాడ్క్లిఫ్
మహిళలకు ఐఆర్సీటీసీ ‘రక్షాబంధన్’ కానుక