(Lahore City) భారతదేశం 1947 ఆగస్ట్ 15 న స్వాతంత్య్రం పొందింది. అయితే, ఈ ప్రక్రియ మాత్రం చాలా ముందుగానే ప్రారంభమైంది. లార్డ్ మౌంట్బాటన్ 1947 జూన్ 3 న భారతదేశం స్వాతంత్య్ర ప్రణాళికను సమర్పించగా.. దానికి జవహర్లాల్ నెహ్రూ, మహమ్మద్ అలీ జిన్నా ఆమోదం తెలిపారు. దాంతో భారతదేశాన్ని రెండు భాగాలుగా విభజించారు. అయితే, విభజన ప్రక్రియ అంత సులువుగా పూర్తికాలేదు. భారతదేశం చాలా వైవిధ్యంగా ఉండి బ్రిటీషర్లకు విభజన చేయడంలో చాలా ఇబ్బందులు తీసుకొచ్చింది. పాకిస్తాన్కు ఏ భాగం ఇవ్వాలనేది సవాల్తో కూడుకున్నదిగా తయారైంది. దాంతో మతం ఆధారంగా విభజన జరుపాలని నిర్ణయించారు. అయినప్పటికీ, అనేక ప్రాంతాల్లో హిందు-ముస్లిం జనాభా దాదాపు సమానంగా ఉన్నది.
ఈ సమస్యను పరిష్కరించేందుకు సిరిల్ రాడ్క్లిఫ్ అనే న్యాయవాదికి విభజన బాధ్యతలను బ్రిటీష్ ప్రభుత్వం అప్పటించింది. ఆయన భారతదేశానికి వచ్చిన తర్వాత బెంగాల్, పంజాబ్ వేదికగా రెండు బార్డర్ కమిషన్లను ఏర్పాటుచేసి.. రెండింటిలో ఇద్దరు చొప్పున హిందు, ముస్లిం న్యాయవాదులను సభ్యులుగా నియమించారు. జూలై 8 న భారత్ వచ్చిన రాడ్క్లిఫ్.. తక్కువ సమయంలో విభజన ప్రక్రియ పూర్తిచేయాల్సిన బాధ్యతను భుజాలపై ఎత్తుకున్నారు. చివరకు రాడ్క్లిప్ లైన్ పేరుతో విభజన ప్రక్రియను 1947 ఆగస్ట్ 12 న పూర్తిచేశారు. ఆ సమయంలో లాహోర్లో హిందు జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ పాకిస్తాన్కు పెద్ద నగరం ఏదీ లేనందున.. లాహోర్ను పాకిస్తాన్కు ఇవ్వాలని రాడ్క్లిఫ్ నిర్ణయించారు. దీంతో ఇరు ప్రాంతాల నుంచి ప్రజలు వలస బాట పట్టి తమకు ఇష్టమైన నగరంలో ఉండేందుకు సిద్ధపడ్డారు. ఇది పూర్తయిన మరుక్షణమే రాడ్క్లిఫ్.. వెనక్కి తిరిగి చూడకుండా బ్రిటన్కు తిరుగు ప్రయాణమయ్యారు.
1999: టర్కీలో 7.4 తీవ్రతతో సంభవించిన భూకంపం, 17,000 మందికి పైగా దుర్మరణం
1998 : మోనికా లెవిన్స్కీతో తనకున్న సంబంధాన్ని అంగీకరించిన క్లింటన్
1988: విమాన ప్రమాదంలో దుర్మరణం పాలైన పాకిస్తాన్ అధ్యక్షుడు జియా ఉల్ హక్
1978: అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా మొదటి హాట్ ఎయిర్ బెలూన్ ప్రయాణం
1970: వెనెరా -7 అంతరిక్ష నౌకను ప్రయోగించిన సోవియట్ యూనియన్
1945: నెదర్లాండ్స్ నుంచి స్వాతంత్ర్యం ప్రకటించుకున్న ఇండోనేషియా
1909: విప్లవకారుడు మదన్లాల్ ధింగ్రా ఉరితీత
మహిళలకు ఐఆర్సీటీసీ ‘రక్షాబంధన్’ కానుక
అక్టోబర్ 8న బాలయ్య ‘అఖండ’.. అంటే ‘ట్రిపుల్ ఆర్’ మళ్లీ వాయిదా..?
భారత్ నిర్మించిన ఆఫ్ఘన్ పార్లమెంట్ భవనం తాలిబన్లు స్వాధీనం