నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా అఖండ. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. విడుదల తేదీని కూడా నేడో రేపో ప్రకటించనున్నారు దర్శక నిర్మాతలు. నిజానికి మే 28 న విడుదల కావాల్సిన ఈ సినిమా.. కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది. ఆ తర్వాత సెప్టెంబర్లో విడుదల అవుతుంది అంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది.
అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా అనుకున్న దానికంటే షూటింగ్ మరింత నెమ్మదిగా జరుగుతుంది.
అది ఆలస్యం కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ విషయంలో కూడా జాప్యం జరుగుతుంది.
అందుకే సెప్టెంబర్ లో ఈ సినిమాను విడుదల చేయడం దాదాపు అసాధ్యం. దాంతో అక్టోబర్ లో అఖండ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమా విడుదల తేది దాదాపు ఖరారు అయిపోయినట్లు తెలుస్తోంది.
అక్టోబర్ 8న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఇది వినగానే ఇండస్ట్రీలో చాలా మంది గుండె జారిపోతుంది. దానికి కారణం అక్టోబర్ 13న రాజమౌళి త్రిబుల్ ఆర్ సినిమా విడుదల కాబోతుండటమే.
అయితే అఖండ సినిమా అక్టోబర్ 8న వస్తుంది అంటే 13న రాజమౌళి సినిమా రానట్లే. అందులో ఎవరికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదు.
ఎందుకంటే పోయి పోయి రాజమౌళి సినిమాతో పోటీ పడటం అంటే ఒక రకంగా సినిమాను చంపేసుకోవడమే. అంత ధైర్యం ఏ నిర్మాత కూడా చేయడు. ఇప్పుడు బోయపాటి శ్రీను ఆ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. బాలయ్య అక్టోబర్ 8న అఖండ సినిమాతో వచ్చాడంటే.. 13న అబ్బాయి త్రిబుల్ ఆర్ రానట్లే.
సింహా, లెజెండ్ తర్వాత ఈ సినిమాలో కూడా బాగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.
అందులో ఒకటి అఘోరా కావడం విశేషం. ఇప్పటికే విడుదలైన టీజర్ యూ ట్యూబ్ లో సంచలనం సృష్టించింది. సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. అఖండ సినిమా బాలయ్య కెరీర్లోనే అత్యధికంగా దాదాపు 60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తున్నట్లు తెలుస్తోంది.