న్యూఢిల్లీ : వ్యవసాయ చట్టాలపై ఒకపైపు పార్లమెంట్లో ప్రతిపక్షాలు ఆందోళన చేస్తుండగా.. మరోవైపు పార్లమెంట్ వెలుపల అవే ప్రతిపక్షాలకు చెందిన ఎంపీలు వాగ్వాదానికి దిగారు. అందరు చూస్తుండగానే ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. బిల్లు తీసుకొచ్చినప్పుడు మాట్లాడకుండా ఉన్న మీరు, ఇప్పుడు ఇలా డ్రామాలు చేయడం ఎందుకు? అంటూ కేంద్ర మాజీ మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ (Harsimrat Kaur) పై కాంగ్రెస్ ఎంపీ రవనీత్ సింగ్ బిట్టూ మండిపడ్డారు.
కేంద్ర మాజీ మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ప్లకార్డుతో పార్లమెంట్ ఆవరణలో ఆందోళనకు దిగారు. అదే సమయంలో అటుగా వెళుతున్న కాంగ్రెస్ ఎంపీ రవనీత్ సింగ్ బిట్టూ అక్కడికి చేరుకుని ఇలాంటి డ్రామాలు కట్టిపెట్టాలన్నారు. దాంతో ఇద్దరు ఎంపీల మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరింది. తమరు మంత్రిగా ఉన్నప్పుడు బిల్లు ఆమోదించగా కిమ్మనలేదు, కానీ రైతుల నిరసన మరింతగా పెరగ్గానే రాజీనామా చేశారని బిట్టూ మండిపడ్డారు. పార్లమెంటులో నిరసన సమయంలో అకాలీదళ్ నాయకులు కనిపించలేదెందుకో చెప్పాలన్నారు.
మరోవైపు, రవనీత్ సింగ్ బిట్టూ చేసిన ఆరోపణపై స్పందించిన హర్సిమ్రత్ కౌర్.. అలాంటి బిల్లును తెచ్చారనే మంత్రి పదవికి రాజీనామా చేసింది నీకు తెలియదా? అంటూ ప్రశ్నించారు. దీనిపై మీరు అబద్ధం చెప్తున్నారని రవనీత్ బిట్టూ అనడంతో.. మంత్రి పదవికి రాజీనామా చేసి రైతుల పక్షాన నిలిచామని కౌర్ సమాధానమిచ్చారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఎక్కడ ఉన్నారో వారినే అడగండంని బిట్టూకు సూచించారు. మీ పార్టీ ఎంపీలు తప్పించుకోవడం వల్లే బిల్లులు ఆమోదం పొందిన విషయం తెలియదా? అంటూ బిట్టూకు కౌంటర్ ఇచ్చారు.
ఇద్దరు ఎంపీల మధ్య జరిగిన ఈ గొడవ వీడియోను చాలా మంది సోషల్ మీడియాలో షేర్ చేశారు. లోక్సభలో బీఎస్పీ నేత రితేష్ పాండే, మరికొందరు ఎంపీలు కూడా హర్సిమ్రత్ కౌర్తో కలిసి వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పార్లమెంట్ ఆవరణలో నిరసన తెలిపారు.
రక్షణ మంత్రి టార్గెట్గా కార్ బాంబు దాడి
ఆసియా తొలి న్యూక్లియార్ రియాక్టర్ ప్రారంభం
ఇక కల్తీ మద్యం అమ్మితే ఉరిశిక్షే..ఎక్కడంటే..?
రానున్న ఐదేండ్లలో లక్ష దాటనున్న బంగారం ధర
పీవీ సింధు ఈ కులమేనా..? ఇంటర్నెట్లో జోరుగా సెర్చింగ్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..