Congress MLA | మధ్యప్రదేశ్ (Madhya Pradesh)కు చెందిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే (Congress MLA ) ఆ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేత ( BJP leader) కాళ్లు మొక్కారు. ఇండోర్ (Indore)లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
ఆదివారం ఇండోర్లో జరిగిన ఓ కార్యక్రమానికి.. ఇండోర్-1 అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే సంజయ్ శుక్లా (Sanjay Shukla) హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి బీజేపీ పార్టీకి చెందిన సీనియర్ నేత కైలాష్ విజయవర్గియా (Kailash Vijayvargiya) కూడా విచ్చేశారు. ఈ క్రమంలో కైలాష్ను చూసిన శుక్లా అతడి వద్దకు వెళ్లి పాదాలకు నమస్కరించారు. అనంతరం ఇద్దరూ కలిసి ఫొటోకు ఫోజిచ్చి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. కాగా, కైలాష్.. వచ్చే ఎన్నికల్లో ఇండోర్ -1 నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీకి సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో ప్రత్యర్థిగా ఉన్న కైలాష్ పాదాలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే నమస్కరించడం స్థానికంగా రాజకీయ చర్చకు దారితీస్తోంది.
#WATCH | Madhya Pradesh: Congress MLA Sanjay Shukla touched the feet of BJP leader Kailash Vijayvargiya during a program in Indore yesterday.
(Source: Congress MLA Sanjay Shukla) pic.twitter.com/anm8oo9ivi
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) October 9, 2023
కాగా, శుక్లా ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న ఇండోర్-1 అసెంబ్లీ నియోజకవర్గం నుండి విజయవర్గియాకు బీజేపీ టిక్కెట్ ఇచ్చింది. 230 అసెంబ్లీ స్థానాలకు ఇప్పటికే రెండు అభ్యర్థుల జాబితాలను కమలం పార్టీ ప్రకటించింది. అయితే, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా అభ్యర్థుల జాబితాను విడుదల చేయలేదు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేయడానికి కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ శనివారం ఢిల్లీలో సమావేశమైంది. మరోవైపు దేశంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. తెలంగాణ సహా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరాం, రాజస్థాన్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ఇవాళ ప్రకటించింది.
మధ్యప్రదేశ్లో ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ వెల్లడించింది. ఈ మేరకు అక్టోబర్ 21న గెజిట్ నోటిఫికేషన్ రానుంది. ఇక అదే రోజు నుంచి నవంబర్ 2 వరకూ నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. నవంబర్ 17న పోలింగ్ నిర్వహిస్తారు. ఇక డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తారు.
Also Read..
IIT Kanpur | ఐఐటీ కాన్పూర్లో రెండు జట్ల మధ్య ఘర్షణ.. కుర్చీలతో కొట్టుకున్న ఆటగాళ్లు.. VIDEO
Odisha train tragedy | 4 నెలలైంది.. మార్చురీలోనే 28 గుర్తుతెలియని మృతదేహాలు