Ukraine-Russia War | ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఏమాత్రం ఆగేలా కనిపించడం లేదు. ఇటీవల కొంతకాలంగా దాడులకు దూరంగా ఉన్న రష్యా మళ్లీ భారీగాస్థాయిలో దాడులకు దిగుతున్నది. ఉక్రెయిన్లోని మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా శుక్రవారం అర్ధరాత్రి తర్వాత వరుసగా క్షిపణులతో దాడులకు దిగింది. దీంతో కీలకమైన నాలుగు విద్యుత్ ప్లాంట్లు ధ్వంసమయ్యాయని.. దేశవ్యాప్తంగా కరెంటు సరఫరాపై ఆంక్షలు అమలు చేయాల్సి వచ్చిందని ఉక్రెయిన్ అధికారులు పేర్కొన్నారు.
వాస్తవానికి పశ్చిమ దేశాల నుంచి ఉక్రెయిన్ దీటుగా రష్యాకు బదులు ఇస్తుండడంతో కొంతకాలంగా ఉక్రెయిన్లోని నాలుగు విద్యుత్ ప్లాంట్లతో పాటు ఇతర మౌలిక సదుపాయాలపై రష్యా దృష్టి పెట్టింది. ఈ క్రమంలో రష్యా ఉక్రెయిన్పై 34 క్షిపణులను ప్రయోగించిందని.. అందులో 21 క్షిపణులను మధ్యలోనే కూల్చేశామని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. మిగతావి తాకడంతో నాలుగు థర్మల్ విద్యుత్ కేంద్రాలు ధ్వంసమైనట్టు వెల్లడించారు.
దాంతో విద్యుత్ వినియోగంపై ఆంక్షలు విధించామని పీక్ టైంలో ఐరన్ బాక్సులు, వాషింగ్ మెషీన్లు వంటివి వినియోగించవద్దని అధికారులు ప్రజలకు సూచించారు. రష్యా దక్షిణ ప్రాంతమైన క్రాన్సోదర్ రీజియన్పై దాడులకు దింగింది. 68 డ్రోన్లను ప్రయోగించగా.. అందులో 66 డ్రోన్లను కూల్చేసినట్టు రష్యా డిఫెన్స్ అధికారులు తెలిపారు. ఉక్రెయిన్ దాడుల్లో స్లవ్యానస్క్ ప్రాంతంలోని రెండు ఆయిల్ రిఫైనరీ ఫ్యాక్టరీలు ధ్వంసమయ్యాయి. ఒక మిలటరీ ఎయిర్ ఫీల్డ్ సైతం దెబ్బతిన్నది.