Uber Cup 2024 : ప్రతిష్ఠాత్మక ఉబెర్ కప్లో భారత అమ్మాయిల జట్టు బోణీ కొట్టింది. సింగిల్స్, డబుల్స్లో జయభేరి మోగించింది. శనివారం జరిగిన తొలి గ్రూప్ దశ మ్యాచ్లో కెనడా(Canada)పై అద్భుత విజయం నమోదు చేసింది. మొదటి మూడు మ్యాచ్లు టైగా ముగియగా.. చివరకు భారత్ 3-0 ఆధిక్యం సాధించింది.
తొలి మ్యాచ్లో అశ్మిత చాలిహ(Ashmita Chaliha) 26-24, 24-22తో మిచెల్లె లీని చిత్తు చేసింది. 42 నిమిషాల పాటు హోరీ హోరీగా సాగిన పోరులో మిచెల్లెపై పై చేయి సాధించింది. ఆ తర్వాత డబుల్స్లో ప్రియ కొంజెగ్బమ్ – శృతి మిశ్రాలు కెనడా జంటపై సూపర్ విక్టరీ కొట్టారు. వరుస మ్యాచుల్లో గెలుపొంది త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించారు. తొలుత క్యాథెరిన్ చోయి , జెస్లిన్ చోపై 21-12, 21-10తో విజయం సాధించింది. ఇషారాణి బరుహ్ సైతం తన రాకెట్ పవర్ చూపిస్తూ 21-13, 21-12తో గెలుపొందింది.