డెహ్రాడూన్: (Amit Shah) కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. ఈ పార్టీ అవినీతి, కుంభకోణాలకు పర్యాయపదమని, ఈ పార్టీ నాయకులు తామిచ్చిన వాగ్దానాలను ఏనాడూ పూర్తిచేయరని ఎద్దేవా చేశారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ‘ఘసియారి కళ్యాణ్ యోజన’ ప్రారంభోత్సవం అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో షా మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీలు చేసిన, నెరవేర్చిన హామీలపై బహిరంగ చర్చకు ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ సిద్ధమా అని అమిత్ షా సవాల్ విసిరారు. మ్యానిఫెస్టోలో పెట్టిన దాదాపు 85 శాతం వాగ్దానాలు పూర్తిచేసినట్లు తెలిపారు.
‘అవినీతి, కుంభకోణాలకు కాంగ్రెస్ పర్యాయపదంగా మారింది. ఏ రాష్ట్ర అభివృద్ధి గురించి కూడా ఆ పార్టీ నేతలు పట్టించుకోరు. కాంగ్రెస్ ఎప్పుడూ తన వాగ్దానాలను తుంగలో తొక్కుతుంది. కాంగ్రెస్ బుజ్జగింపులు మాత్రమే చేస్తుంది. ఉత్తరాఖండ్కు ఎలాంటి సంక్షేమ పనులు చేపట్టలేదు’ అని అమిత్ షా అన్నారు. కొవిడ్-19, రాష్ట్రంలో వరదలు వచ్చిన సమయంలో కాంగ్రెస్ నేతలు కనిపించకుండాపోయారని, అదే, ఎన్నికలు దగ్గర పడగానే బయటకు వచ్చి మీడియా సమావేశాలు ప్రారంభిస్తున్నరని ఎద్దేవా చేశారు.
ఆ రైతులకు అండగా టీటీడీ : చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
ఏపీలో పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య
సమాజ్వాది పార్టీలో చేరిన బీఎస్పీ, బీజేపీ ఎమ్మెల్యేలు
అనారోగ్యంతో భార్య మృతి.. తట్టుకోలేక భర్త కన్నుమూత
తిరుమల ఘాట్లో ఎలక్ట్రిక్ బస్సులు.. ప్రారంభించనున్న సీఎం జగన్
బద్వేలులో ప్రశాంతంగా ఉప ఎన్నిక పోలింగ్
నవంబర్ 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు?!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..