న్యూఢిల్లీ : ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ఉగ్రవాదుల దుశ్చర్యలు పెరిగిపోతున్నందున వెంటనే అక్కడ ఉన్న భారతీయులను రప్పించేలా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ (Congress demand) చేసింది. ఆఫ్ఘాన్లో ఉన్న హిందువులు, సిక్కులకు ఏదైనా జరిగితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే జవాబు చెప్పాలని కాంగ్రెస్ నేత జేవియర్ షెర్గిల్ అన్నారు. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్కు విజ్ఞప్తి చేస్తూ జేవియర్ షెర్గిల్ సోమవారం లేఖ విడుదల చేశారు.
ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా, నాటో దళాలు వెళ్లిపోతున్న తరుణంలో అక్కడ తాలిబాన్లు సాగిస్తున్న దమనకాండ మీకు బాగా తెలుసని, అందుకే అక్కడ ఉన్న భారతీయులను సురక్షితంగా తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని షెర్గిల్ కోరారు. ఆఫ్ఘాన్ను మరోసారి తమ గుప్పిట్లోకి తీసుకోవాలని తుపాకులతో తాలిబాన్లు యుద్ధం చేస్తున్న విషయం మీకు తెలియంది కాదని, సైన్యం-తాలిబాన్ల మధ్య భారతీయులు నలిగిపోతున్నారన్నారు. పకిటా ప్రాంతంలోని గురుద్వారాకు చెందిన నిషాన్ సాహిబ్ను తాలిబాన్ ఉగ్రవాదులు తొలగించిన విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. గతంలో కాబూల్లో గురుద్వారాపై దాడి చేసి 25 మంది సిక్కులను ఊచకోత కోయడం, 2018 లో జలాలాబాద్లో 19 మంది సిక్కులు, హిందువులను చంపడం వంటి ఘటనలు తమకు తెలియంది కావన్నారు. తమకున్న సమాచారం మేరకు ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధంలో 650 మంది సిక్కులు, 50 మంది హిందువులు నలిగిపోయి ఉన్నారని షెర్గిల్ తెలిపారు.
12 రెట్లు పెరిగిన ఎంఆర్ఎఫ్ లాభం
మార్కెట్లోకి హోండా ఇ-స్కూటర్ యు-గో
కాకోరి రైలు దోపిడీకి 96 ఏండ్లు
రెండో సెషన్ ఐపీఎల్ కోసం కొత్త నిబంధన.. అదేంటంటే..?
తడిసి మోపెడవుతున్న డిజిటల్ ఖర్చు..
రక్తంలో షుగర్ నియంత్రణకు కృత్రిమ క్లోమం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..