ముంబై: జూన్ నెలతో ముగిసిన తొలి త్రైమాసికం ఫలితాల్లో టైర్ల తయారీ సంస్థ ఎంఆర్ఎఫ్ (MRF Profits) బంపర్ లాభాన్ని ఆర్జించింది. కంపెనీ లాభం 12 రెట్లు పెరగ్గా.. ఆదాయం కూడా 70 శాతం పెరిగింది. జూన్ త్రైమాసికం ఫలితాలను ఎంఆర్ఎఫ్ సోమవారం విడుదల చేసింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.13.5 కోట్ల నుంచి కంపెనీ లాభం సంవత్సరానికి 12 రెట్లు అధికంగా రూ.165.5 కోట్లకు పెరిగింది.
జూన్ త్రైమాసికంలో ఆదాయాలు 70 శాతం పెరిగి వార్షిక ప్రాతిపదికన గొప్ప వృద్ధిని చూసింది. ఆదాయం గత సంవత్సరం జూన్ త్రైమాసికంలో రూ.2,460 కోట్లకు గాను 70 శాతం పెరిగి.. రూ.4,184 కోట్లకు చేరింది. కంపెనీ నిర్వహణ లాభం కూడా దాదాపు 50 శాతం పెరిగింది. ఇది రూ.332.2 కోట్ల నుంచి రూ.495.6 కోట్లకు పెరిగింది.
మార్కెట్లోకి హోండా ఇ-స్కూటర్ యు-గో
కాకోరి రైలు దోపిడీకి 96 ఏండ్లు
రెండో సెషన్ ఐపీఎల్ కోసం కొత్త నిబంధన.. అదేంటంటే..?
తడిసి మోపెడవుతున్న డిజిటల్ ఖర్చు..
రక్తంలో షుగర్ నియంత్రణకు కృత్రిమ క్లోమం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..