బెంగళూర్ : కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు (Karnataka assembly elections ) పోలింగ్ జరుగుతుండగా కాషాయ పార్టీపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. గోవా నుంచి పెద్దసంఖ్యలో ఓటర్లను కర్నాటకకు బీజేపీ తరలిస్తోందని ఆరోపించింది. రాష్ట్రంలో దొంగ ఓట్లు వేయించేందుకే బీజేపీ గోవా నుంచి ప్రజలను బస్సుల్లో తరలిస్తోందని కాంగ్రెస్ విమర్శించింది.
గోవా నుంచి కర్నాటకకు వస్తున్న బస్ వీడియోతో కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేసింది. గోవాలో బీజేపీ సర్కార్ కాదంబ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సుల్లో ప్రజలను ఉత్తర కర్నాటకకు అర్ధరాత్రి ఎందుకు పంపిందని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ప్రశ్నించారు. కర్నాటక డీజీపీకి కాంగ్రెస్ నేత రణ్దీప్ సుర్జీవాలా ఈ పోస్ట్ను ట్యాగ్ చేస్తూ ఉత్తర కన్నడ జిల్లా దండేలిలోని వుడ్జ్ జింగిల్ రిసార్ట్లో ఏం జరుగుతోందని నిలదీశారు.
Why is the Goa BJP govt sending people from Goa on Kadamba Transport Corporation buses to northern Karnataka tonight?
Why???
Is illicit money being transported?
Is bogus voting the objective? https://t.co/yQFDuZTDs6
— Congress (@INCIndia) May 9, 2023
విశ్వజిత్ రాణే ఆరు రూంలను అక్కడ ఎందుకు బుక్ చేశారని ప్రశ్నించారు. ఇక కర్నాటకలో 224 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బుధవారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అధికారం నిలుపుకునేందుకు కాషాయ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతుండగా, ప్రభుత్వ వ్యతిరేకత ఆసరాగా అందలం ఎక్కేందుకు కాంగ్రెస్ చెమటోడుస్తోంది. కింగ్ మేకర్గా అవతరించి సత్తా చాటాలని జేడీఎస్ ఉవ్విళ్లూరుతోంది. మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
Read More
Cheetah | 3 నెలలు.. 3 చీతాలు మృతి.. మోదీపై తీవ్ర విమర్శలు..!