నిజామాబాద్: ప్రజలు గట్టిగా కోరుకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెలరోజుల్లో కూలిపోతుందని నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ (MP Arvind) అన్నారు. మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అనకుంటే ప్రభుత్వం పడిపోతుందని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో ఆయన రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ పతనావస్థకు చేరిందన్నారు. దేశంలో ఉన్న రెండు రాష్ట్రాల్లోనూ ఆ పార్టీ ప్రభుత్వాలు పడిపోతాయని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ తప్పుడు హామీలతో గద్దెనెక్కి ప్రజలను మోసగించిందనిర్శ్రించారు. అవినీతిచేసే రోజు వస్తే రాజకీయాలు వదిలేస్తా తప్పా.. తప్పు చేయనని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే జక్రాన్పల్లి ఎయిర్పోర్ట్ ఏడాదిలోపే తెరచుకోవచ్చని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకున్నందుకు మన పనులు కావట్లేదని వెల్లడించారు.
లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది
మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తలుచుకుంటే ఇప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది – అరవింద్ ధర్మపురి pic.twitter.com/CnxRyjyNt1
— Telugu Scribe (@TeluguScribe) May 10, 2024