Cheetah | భోపాల్, మే 9: మన దేశంలో వాతావరణం చీతాలకు అనుకూలం కాదని, అవి ఇక్కడ బతకలేవని పలువురు నిపుణులు ఎంత చెప్పినా ప్రధాని మోదీ వినలేదు. దక్షిణాఫ్రికా నుంచి చీతాలను తీసుకొచ్చి మధ్యప్రదేశ్లోని కూనో జాతీయ పార్కులో ఉంచారు. కానీ చివరికి నిపుణులు చెప్పినదే నిజమవుతున్నది. ఇప్పటికే మార్చిలో ఒక చీతా, ఏప్రిల్ మరొకటి మరణించగా తాజాగా ఇంకొకటి ప్రాణాలుకోల్పోయింది. ‘దక్ష’ అనే పేరుగల ఆడ చీతా మంగళవారం మృతిచెందినట్టు అధికారులు ప్రకటించారు. ‘ఉదయం చీతాను పరిశీలించగా గాయాలు ఉన్నాయి. వెంటనే చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది’ అని అధికారులు తెలిపారు. మరోవైపు వరుసగా చీతాలు మరణించడంపై పలు విమర్శలు వస్తున్నాయి. భారత్లో చీతాలు మనుగడ సాగించలేవని తెలిసి కూడా ఇక్కడికి తీసుకురావడం మూగజీవాలను హింసించడమేనని పలువురు విమర్శించారు.