న్యూఢిల్లీ : వచ్చే సెప్టెంబర్ నెలాఖరు నుంచి చిన్నారులకు కరోనా వ్యాక్సిన్లు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఢిల్లీ ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. మూడు కంపెనీల టీకాలకు ఆగస్టు-సెప్టెంబర్ నాటికి అనుమతి లభిస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ వ్యాక్సినేషన్ పిల్లలను ఇన్ఫెక్షన్ ప్రమాదం నుంచి కాపాడుతుందని పేర్కొన్నారు. చిన్నారులకు వ్యాక్సిన్ వేసే కార్యక్రమం వైరస్ ట్రాన్స్మిషన్ చైన్ను విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కరోనా మహమ్మారికి సంబంధించి కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వాటి కట్టడికి బూస్టర్ డోసులు అవసరమని డాక్టర్ గులేరియా అభిప్రాయపడ్డారు. చాలా మందిలో వ్యాధి నిరోధకత తగ్గిపోతున్న సమయంలో కొత్త వేరియంట్లు ప్రమాదకరంగా మారుతాయని ఆయన భయాందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో డాక్టర్ రణదీప్ గులేరియా ప్రసంగించారు. జైడస్ ట్రయల్స్ పూర్తయ్యాయని, అత్యవసర అనుమతి కోసం కంపెనీ ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. భారత్ బయోటెక్ ఉత్పత్తి చేస్తున్న కోవాక్సిన్ ట్రయల్ కూడా ఆగస్టు-సెప్టెంబర్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉన్నదన్నారు. ఫైజర్ వ్యాక్సిన్ను ఇప్పటికే యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) ఆమోదించిందని తెలిపారు. దేశంలో ఇప్పటివరకు 42 కోట్లకు పైగా మందికి కొవిడ్ వ్యాక్సిన్లు అందించామని, ఈ ఏడాది డిసెంబర్ కల్లా పెద్దవారికందరికీ టీకాలు వేసే కార్యక్రమాన్ని పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు గులేరియా వెల్లడించారు.
ఐఏఎస్ అధికారి నివాసంలో సీబీఐ తనిఖీలు
రాజ్ కుంద్ర సంస్థకు శిల్పాశెట్టి రాజీనామా
చరిత్రలో ఈరోజు.. దేశ ఆర్థిక వ్యవస్థను మార్చిన బడ్జెట్ ఇది
పైకి పెరిగిన భూమి.. హర్యానాలో వింత సంఘటన!.. వీడియో వైరల్..
ఈ శాండ్విచ్ చాలా కాస్లీ గురూ!
న్యాయం కోసం ఎదురుచూస్తూ చనిపోయిన 108 ఏండ్ల వ్యక్తి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..