కర్నాల్ : మనం సాధారణంగా భూమి కుంగడం చూస్తుంటాం. ఇటీవల భూమి కుంగిపోవడంతో మహారాష్ట్రలో, రెండ్రోజుల క్రితం ఢిల్లీలో కార్లు భూమిలోకి దిగబడిపోయిన వార్తలు విన్నాం. అయితే, హర్యానాలో మాత్రం అకస్మాత్తుగా భూమి పైకి పెరిగి స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. అకస్మాత్తుగా భూమి పైకి లేచిన వీడియో చూసి ఈ ప్రాంతాన్ని చూసేందుకు స్థానికులు ఇక్కడికి చేరుకుంటున్నారు. దీనికి సంబంధించిన వివరాలు సేకరించడంలో అధికారులు నిమగ్నమై ఉన్నారు. ఈ వింత ఘటన కర్నాల్లోని నైసింగ్ నార్దక్ కాలువ సమీపంలో జరిగింది.
కర్నాల్-కైతాల్ రహదారిపై ఉన్న పొలం నుంచి ఒక కాలువ వెళ్తుంది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఈ కాలువ సమీపంలోని ప్రాంతం వర్షపు నీటితో నిండిపోయింది. వర్షం వెలియడంతో స్థానికులు పొలం పనులకు దిగిన సందర్భంలో అకస్మాత్తుగా భూమి పైకి లేవడం కనిపించింది. నీరు నిండివున్న ప్రాంతంలో భూమి వేగంగా పైకి పెరగడం ప్రారంభించింది. భూ ప్రకంపనలు రావడం వల్లనే ఇలా జరిగి ఉంటుందని స్థానికులు అనుమానపడి భయంతో పరుగులు తీశారు. ఈ సంఘటనతో పరిసర గ్రామాల ప్రజలు కూడా అప్రమత్తమయ్యారు. ఈ ఘటనతో పొలాల్లో పనిచేసేప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇలాంటి ఘటనను చూడటం ఇదే మొదటిసారి అని గ్రామస్థులు చెప్తున్నారు. వర్షపునీటితో నిండి ఉన్న ఈ ప్రాంతంలోని భూమిలో ఒక్కసారిగా ధ్వనులు వచ్చి పైకి ఉబికిరావడం గమనించామని వారంటున్నారు. వర్షపు నీటితో ఉన్న ఈ ప్రాంతం కొన్ని ఫీట్ల ఎత్తువరకు పైకి రావడం వింత సంఘటనే అని వారు తెలిపారు. అక్కడడక్క పగుళ్లు కూడా ఏర్పడ్డాయని, ఇది అతీంద్రియ దృగ్విషయంగా కనిపిస్తందని గ్రామానికి చెందిన సునీల్, రాజేంద్ర, సుభాష్, అనిల్ తదితరులు చెప్పారు.
ఢిల్లీలోని రోహింగ్యా క్యాంప్ను కూల్చిన యోగి సర్కార్.. ఎందుకంటే..?
ఈ శాండ్విచ్ చాలా కాస్లీ గురూ!
తొలి త్రైమాసికంలో అదరగొట్టిన హిందూస్తాన్ యూనిలీవర్
ఉయ్ఘర్ ముస్లింలపై హింసకు చైనా నిర్బంధ కేంద్రాలు
చైనాలో విషాదం.. హైవే టన్నెల్ నీటిలో చిక్కుకుని 13 మంది మృతి
న్యాయం కోసం ఎదురుచూస్తూ చనిపోయిన 108 ఏండ్ల వ్యక్తి
ఢిల్లీలో రైతు పార్లమెంట్.. షరతులతో అనుమతి
చరిత్రలో ఈరోజు.. మువ్వన్నెల జెండాకు ఆమోదం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..