పాట్నా : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్పై (Yogi Adityanath) బిహార్లో కేసు నమోదైంది. ఆదివారం ఆయన చేసిన ఆబ్బా జాన్ అనే వ్యాఖ్యలపై ముజఫ్ఫర్పూర్కు చెందిన యువకుడు ఒకరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలు భారతదేశంలోని ముస్లింలను కించపరిచేవిగా ఉన్నాయని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
యోగి ఆదిత్యనాథ్పై బిహార్లో కేసు నమోదైంది. ఆయన చేసిన అబ్బా జాన్ వ్యాఖ్యలపై ముజఫ్ఫర్పూర్కు చెందిన తమన్నా హాష్మి అనే యువకుడు ముజఫ్ఫర్పూర్ జిల్లా చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. త్వరలో జరుగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటర్లను తన వైపునకు తిప్పుకునేందుకు యోగి ఆదిత్యనాథ్ ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించారని తన ఫిర్యాదులో హాష్మి తెలిపాడు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఒక నిర్దిష్టమైన వర్గానికి వ్యతిరేకంగా అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం దేశంలో విభజనను సృష్టిస్తుందని ఆరోపించారు. ఇది ఓట్లను సంపాదించడానికి ఒక సమాజాన్ని లక్ష్యంగా చేసుకునే ప్రయత్నం తప్ప మరొకటి కాదని హష్మి అన్నారు. హష్మి దాఖలు చేసిన పిటిషన్ను విచారణకు ముజఫర్పూర్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ స్వీకరించారు. తదుపరి విచారణ సెప్టెంబర్ 21 న జరిగే అవకాశాలు ఉన్నాయి.
ఫిబ్రవరిలో ముచ్చింతల్లో ‘స్టాచూ ఆఫ్ ఈక్వాలిటీ’ విగ్రహావిష్కరణ
గాంధీ జయంతి కల్లా గాడ్సే విగ్రహం ప్రతిష్ట
ఎంపీ అర్జున్ సింగ్ నివాసం వద్ద మరో బాంబు పేలుడు
నీరజ్ జావెలిన్ కోచ్ ఉవే హూన్ తొలగింపు
బీఏలో ఆప్షనల్ సబ్జెక్ట్గా ‘రామ్చరిత్మానస్’.. ఎక్కడంటే?
‘నీట్’గా రూ.35 లక్షలకు పేపర్ అమ్మాడు.. ఎక్కడంటే..?
నీలి రంగు జెర్సీలోకి మారిన ఆర్సీబీ.. ఎందుకంటే?
అధికార భాషగా హిందీకి 72 ఏండ్లు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..