భోపాల్ : రాముడిని వాడుకోవడం బీజేపీకి తెలిసినంతగా ఇంకే పార్టీ వారికి తెలియదేమో! ఎందుకంటే ఎన్నికలు ఉన్నా, లేకున్నా రాముడే వారికి ఆధారం. అయోధ్య రాముడి కోసం ఏండ్ల తరబడి ఆందోళన జరిపిన బీజేపీ.. ఇప్పుడు లోక్సభ ఎన్నికల నాటికి రామాలయాన్ని పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఒత్తిడి తెస్తున్నది. వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు మధ్యప్రదేశ్ బీజేపీ కూడా రాముడి జపం చేస్తున్నది. కాకపోతే ఇక్కడ కొంచెం వెరైటీగా.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బీఏ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు శ్రీరాముడి గురించి చదవాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఉన్నత విద్య విభాగం ‘రామ్చరిత్మానస్ ప్రాక్టికల్ దర్శన్’ (Ramcharitmanas) అనే సిలబస్ను సిద్ధం చేసింది. ఇందులో 100 మార్కుల పరీక్ష ఉంటుంది. ఇది ఫిలాసఫీలో బోధించనున్నారు. ఇది ఐచ్ఛికం. అందరికీ తప్పనిసరి కాదు. ఈ సబ్జెక్ట్ను హిందీ లేదా ఫిలాసఫీ ప్రొఫెసర్లు బోధిస్తారు. ఇది ఈ సంవత్సరం నుంచే విద్యార్థులకు బోధించాలని ఆదేశాలు జారీ చేశారు.
ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ మంత్రి మోహన్ యాదవ్ మీడియాకు వెల్లడించారు. రామచరిత్మానస్.. సైన్స్, సంస్కృతి, సాహిత్యంతోపాటు శృంగారాన్ని కూడా కలిగి ఉన్నదని చెప్పారు. ఇది ఏ తానికి సంబంధించింది కాదన్నారు. ఉర్దూ గజల్ని కూడా ఒక సబ్జెక్ట్గా ప్రవేశపెట్టామని తెలిపారు. కాగా, తమ ప్రభుత్వం తప్పిదాలను కప్పిపెట్టి రానున్న ఎన్నికల్లో లాభం పొందేందుకే బీజేపీ నేతలు ఇలాంటి చౌకబారు ప్రయత్నాలు చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరిఫ్ మసూద్ విమర్శించారు.
నీలి రంగు జెర్సీలోకి మారిన ఆర్సీబీ.. ఎందుకంటే?
అధికార భాషగా హిందీకి 72 ఏండ్లు
బర్రెపై ఎక్కి వచ్చి నామినేషన్ దాఖలు.. ఎక్కడంటే..?
యాంటీఆక్సిడెంట్ మందుతో గుండెపోటు నివారించొచ్చు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..